English | Telugu

ఊహించ‌ని ట్విస్ట్‌: తుల‌సి కాళ్లు ప‌ట్టుకుని బోరుమ‌న్న నందు

జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ధారావాహిక `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి`. ఈ సీరియ‌ల్ రోజుకో మ‌లుపు తిరుగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. గ‌త కొన్ని ఎపిసోడ్‌ల‌ని ప‌రిశీలిస్తే లాస్య మాయ‌లో ప‌డిన నందు భార్య‌ తుల‌సిని అనుమానిస్తూ అవ‌మానిస్తూ చివ‌రికి ఆమెకు విడాకులిస్తాడు. అయితే తులిసి నిజాయితీ తెలిసిన నందు తండ్రి ఆమెకు అండ‌గా నిలిచి త‌న ఇంటిని ఆమె పేరు మీద రాసేస్తాడు.

దీంతో నందుక‌కు విడాకులిచ్చినా తుల‌సి ఇంట్లోనే వుండిపోతుంది. గ‌త కొంత కాలంగా లాస్య ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగెత్తిపోయిన నందు తుల‌సితో క‌లిసి ఆఫీస్ ప‌నిమీద క్యాంప్‌కి వెళ్లాల్సి వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో ఒంట‌రిగా క‌లుసుకున్న భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తీసుకోబోతోంది. హోట‌ల్ రూమ్‌లో తుల‌సిని వ‌దిలి బ‌య‌టికి వెళ్లిన నందు చిత్తుగా తాగి వ‌స్తాడు.

ఇది గ‌మ‌నించిన తుల‌సి తాగి వ‌చ్చారా? అని నందూని నిల‌దీస్తుంది. మ‌నం మాజీ భార్యా భ‌ర్త‌లం అన్నావ్‌.. ఎవ‌రిదారి దారిది అన్నావ్ ఇప్పుడ న‌న్నెందుకు నిల‌దీస్తున్నావ్ అంటాడు నందు. దానికి తుల‌సి సారీ చెబుతుంది. ఆ త‌రువాత `నీతో నిజాలు చెప్పాల‌ని.. అందుకు ధైర్యం చాల‌కే తాగి వ‌చ్చాన‌ని అంటాడు నందు. ఆ త‌రువాత తుల‌సి - నందుల మ‌ధ్య ఆస‌క్తిక‌ర మాట‌లు చోటు చేసుకుంటాయి. అయితే లాస్య లాంటి మాయ లేడి వ‌ల‌లో ప‌డ్డాన‌ని, త‌న నుంచి కాపాడ‌మ‌ని నందు వేడుకుంటూ తుల‌సి కాళ్ల‌పై ప‌డ‌టం.. తుల‌సి .. నందుని ఓదార్చ‌డం .. చివ‌ర‌కు అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వ‌డం ఈ రోజు ఎపిసోడ్‌లోని కీల‌కాంశాలు. అయితే నందు నిజంగానే తుల‌సి కోసం ఏడ్చాడా? .. నందు లాస్య‌ని వ‌దిలించుకోవాల‌ని నిజంగానే భావిస్తున్నాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు జీ తెలుగులో ప్ర‌సారం అయ్యే `ఇంటింటి గృహ‌ల‌క్ష్మీ` ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.