English | Telugu

ఈ ఇద్ద‌రిలో ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రు?

బిగ్‌బాస్ సీజ‌న్‌5 ఎండింగ్‌కు చేరుకుంది. విమ‌ర్శ‌లు నేప‌థ్యంలో ముందుకు సాగుతున్న బిగ్‌బాస్ తాజాగా 13వ వారం ఎలిమినేష‌న్ రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ నేప‌థ్యంలో కంటెస్టెంట్‌ల‌లో టెన్ష‌న్ మొద‌లైంది. ఈ శ‌నివారం ఎలిమినేష‌న్స్‌లోవున్న వాళ్ల‌లో ఎవ‌రు ఎలిమినేట్ కాబోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. 19 మంది స‌భ్యుల‌తో మొద‌లైన ఈ షోలో ప్ర‌స్తుతం 7 స‌భ్యులు మాత్ర‌మే మిగిలారు. ఇందులో ఎవ‌రు టాప్ ఫైకి చేర‌తార‌న్న‌ది ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ 13వ వారం ఎలిమినేష‌న్ లో వున్న వాళ్ల‌లో ఈ ఇద్ద‌రు కంటెస్టెంట్‌ల‌లో ఒక‌రు బ‌య‌టికి వెళ్లే అవ‌కాశం వుంద‌ని తాజాగా తెలుస్తోంది. ఆ ఇద్ద‌రు స‌భ్యులు మ‌రెవ‌రో కాదు ఒక‌రు కాజ‌ల్‌, మ‌రొక‌రు ప్రియాంక‌.ఈ వారం స‌న్నీ, ష‌ణ్మ‌ఖ్ మిన‌హా మిగిలిన ఇంటి స‌భ్యులైన ప్రియాంక‌, కాజ‌ల్‌, సిరి, మాన‌స్‌, శ్రీ‌రామ‌చంద్ర వున్నారు. ఈ స‌భ్యుల్లో శ్రీ‌రామ‌చంద్ర కు ఓటింగ్ భారీ స్థాయిలో వుంది. అంటే ను ఈవారం సేఫ్ అవుతాడ‌న్న‌మాట‌. మాన‌స్ కూడా కొంత ఓటింగ్ ప‌రంగా ముందు వ‌రుస‌లోనే వున్నాడు. ఇక మిగిలిన సిరి, ప్రియాంక‌, కాజ‌ల్‌లే వెన‌క‌బ‌డి వున్నారు.

ఈ ముగ్గురిలో గ‌త వార‌మే ఒక‌రు ఎలిమినేట్ కావాల్సింది. కానీ కాజ‌ల్‌ని స‌న్నీ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌తో కాపాడిన విష‌యం తెలిసిందే. సిరిని ప‌క్క‌న పెడితే ఈ వారం ప్రియాంక లేదా కాజ‌ల్ బ‌య‌టికి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కార‌ణం వారి ఓటింగ్. అయితే ఎలిమినేష‌న్ జ‌న్యూన్‌గా జ‌రిగితే మాత్రం ప్రియాంక కాకుండా కాజ‌ల్ ఈ వారం బ‌య‌టికి వెళ్లే అవ‌కాశాలు వున్న‌ట్టుగా తెలుస్తోంది. ఏం జ‌ర‌గ‌నుందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.