English | Telugu

రాగ‌సుధ‌కు ఎదురుప‌డిన‌ ఆర్య వ‌ర్థ‌న్ ఏం జ‌ర‌గ‌నుంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. శ్రీరామ్ వెంక‌ట్‌, వ‌ర్ష కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ్యోతిరెడ్డి, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, జ‌య‌ల‌లిత‌. అనుషా సంతోష్ కీల‌క పాత్రలు పోషించారు. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ ఉత్కఠ‌భ‌రిత స‌న్నివేశాల‌తో మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ శ‌నివారం ఏం జ‌ర‌గ‌నుందో ఒక సారి చూద్దాం. రాగ‌సుధ‌, అను క‌లిసి రెస్టారెంట్ కి వెళతారు. ఆర్య వ‌ర్థ‌న్ త‌న ఆఫీస్ స్టాఫ్ మీటింగ్ కార‌ణంగా టీమ్ తో క‌లిసి ఇదే రెస్టారెంట్ కి వ‌స్తాడు.

క‌ట్ చేస్తే మాన్సీ మాత్రం మందుకు అల‌వాటు ప‌డిపోతుంది. ఏకంగా ఇంట్లోనే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయ‌డం మొద‌లుపెడుతుంది. ఇంటికి వ‌చ్చిన ఫ్రెండ్స్ తో మందు కొడుతూ ఎంజాయ్ చేస్తూ వుంటుంది. మాన్సీ నువ్వు ఇంకా మారాలంటూ త‌మ ఇంట్లో వారు ఏం చేస్తున్నారో.. ఇంటి వారిని ఎలా లొంగ‌దీసుకుంటున్నారో ఎబుతుంటారు. దీంతో మాన్సీ.. నీర‌జ్‌తో పాటు త‌న అత్త నిర్మ‌లాదేవికి ఫోన్ చేసి ఇంటికి ర‌మ్మంటుంది. క‌ట్ చేస్తే రెస్టారెంట్ లో ఆర్డ‌ర్ చేసిన ఫుడ్ లేట‌వుతుండ‌టంతో అను.. రాగ‌సుధ ని నీ గురించి చెప్ప‌మంటుంది. అయితే రాగ‌సుధ తెలివిగా ముందు నీ ఫ్యామిలీ గురించి చెప్పుఅంటుంది.

Also Read:బాలీవుడ్ డైరెక్టర్ కోసం 'బ‌బ్లీ బౌన్సర్'గా మారిన త‌మ‌న్నా

అయ‌నా అను ముందు నీ ఫ్యామిలీ గురించి చెప్ప‌ని తిరిగి అగ‌డ‌టంతో నేను ఒంట‌రిదానిన‌ని, నాకు ఎవ‌రూ లేర‌ని చెబుతుంది.. అయినా అను .. రాగ‌సుధ గురించి ఇంకా తెలుసుకోవాల‌ని త‌న‌ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది.. అయినా రాగ‌సుధ చెప్ప‌దు. ఇంత‌లో వీళ్లు ఆర్డ‌ర్ చేసిన ఫుడ్ వ‌చ్చేస్తుంది. అయితే వెయిట‌ర్ పొర‌పాటుగా క‌ర్రీ రాగ‌సుధ చీర‌పై ప‌డేలా పెడ‌తాడు. దీంతో క్లీన్ చేసుకోవ‌డానికి వాష్ రూమ్ కి వెళుతుంది.. తిరిగి బ‌య‌టికి వ‌స్తుండ‌గా .. రాగ‌సుధ‌కు ఆర్య‌వ‌ర్థ‌న్ ఎదురుప‌డ‌తాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. రాగ‌సుధ ఏం చేసింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.