English | Telugu

రేడియోజాకీ పోస్ట్ కి రాజీనామా చేసిన కృష్ణతులసి

జీ తెలుగులో కృష్ణతులసి సీరియల్ ప్రతీ వారం టాప్ టు ప్లేసెస్ లో నిలుస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గురవమ్మ అప్పు తీర్చడానికి ఆమె కూతురు రూపారాణికి శ్యామా ఘోస్ట్ సింగర్ గా పాటలు పాడుతూ ఉంటుంది. శ్యామా భర్త అఖిల్ వాళ్ళ తాతయ్యకు ఆక్సిడెంట్ జరుగుతుంది. అతను కోమా స్టేజిలోకి వెళ్లిపోయేసరికి మ్యూజిక్ థెరఫీ వల్ల అతన్ని బతికించుకోవచ్చని డాక్టర్ చెప్తారు. అలా శ్యామా పాటతో వల్ల తాతయ్య బతుకుతాడు. ఈ నేపథ్యంలో శ్యామా గురవమ్మ అప్పు తీర్చడానికి బ్లూ ఎఫ్ ఎం స్టేషన్ లో పని చేస్తోందని వసంతకు తెలుస్తుంది. ఇంతలో ఐశ్వర్యకి గురవమ్మకు మధ్య తలెత్తిన మనస్పర్థలు కారణంగా తెలివిగా ఐశ్వర్య తన సెల్ లో రికార్డు చేసిన ఆధారాలను వసంతకు చూపించి ఆమెను , రూపారాణిని ఇంట్లోంచి వెళ్లగొడుతుంది.

బ్యూటీ కాంటెస్ట్ పోటీకి ఐశ్వర్యకు జడ్జిగా రమ్మంటూ ఆహ్వానం వస్తుంది. కానీ వెళ్లలేకపోతుంది. తాను వెళ్లలేనప్పుడు శ్యామా కూడా జాబ్ చేయడం కరెక్ట్ కాదు అని మనసులో కుళ్లిపోతుంది. వసంతతో చెప్పించి జాబ్ రిజైన్ చేసేలా ప్లాన్ చేసి ఆమెతో అదే విషయాన్ని చెప్పేస్తుంది. శ్యామా ఆ బాధను భరించలేక కన్నయ్య విగ్రహం దగ్గర తన బాధ చెప్పుకుంటుంది. అది విన్న అఖిల్ వెళ్లి వాళ్ళ అమ్మ వసంతకు నచ్చ జెప్తాడు. దాంతో వసంత కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. అక్కడితో ఆ సమస్య తీరుతుంది. మరో పక్క బ్లూ ఎఫ్ ఎం స్టేషన్ హెడ్ అమెరికా వెళ్లాల్సి వస్తుంది. ఇక స్టేషన్ బాధ్యతలను చూసుకోవాలంటూ సౌజన్యకు చెప్తాడాయన. కృష్ణ తులసిని పిలిచి "మాట పాట విత్ కృష్ణ తులసి " ప్రోగ్రాం ఎలా సక్సెస్ అయ్యిందో అంతకు మించి మరో ప్రోగ్రాం ని డిజైన్ చేసే బాధ్యతను శ్యామాకి అప్పగిస్తాడు. ఇక ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాలను ఈ రోజు మధ్యాహ్నం ప్రసారమయ్యే కృష్ణతులసి సీరియల్ లో చూడొచ్చు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.