English | Telugu

బిగ్‌బాస్ విజేత‌పై మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

బిగ్‌బాస్ సీజ‌న్ 5 క‌థ క్లైమాక్స్‌కు చేరింది. 13వ వారం ఎండ్ కావ‌డం.. ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కావ‌డంతో హౌస్‌లో ప్ర‌స్తుతం 6 గురు స‌భ్యులు మాత్ర‌మే వున్నారు. ఈ ఆరుగురిలో వ‌చ్చేవారం మ‌రొకరు ఎలిమినేట్ కానున్నారు. మిగ‌తా స‌భ్యులు టాప్ 5కి చేర‌బోతున్నారు. ఇదిలా వుంటే బిగ్‌బాస్ సీజ‌న్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ తాజా సీజ‌న్ విజేత ఎవ‌రో అప్పుడే చెప్పేశాడు. సీజ‌న్ 3లో టైటిల్ రేస్‌లో లేని రాహుల్ అనూహ్యంగా టైటిల్ విజేత‌గా నిలిచిన విష‌యం తెలిసిందే.

తాజాగా బిగ్‌బాస్ సీజన్ 5 విజేత ఎవ‌ర‌న్న దానిపై చ‌ర్చ జ‌రుగుతున్న వేళ రాహుల్ సిప్లిగంజ్ త‌న మ‌ద్ద‌తు ఎవ‌రికో.. ఇంత‌కీ ఈ సీజ‌న్ విజేత ఎవ‌రో బ‌య‌ట‌పెట్టేశారు. చాలా మంది ర‌క ర‌కాల అభిప్రాయాల్ని వ్య‌క్తం చేస్తున్న వేళ రాహుల్ అన్న మాట‌లు అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. గ‌త సీజ‌న్ విజేత గురించి ముందే ఊహించిన రాహుల్ అదే త‌ర‌హాలో సీజ‌న్ 5 విజేత ఎవ‌ర‌న్న‌ది స్ప‌ష్టం చేశాడు. అత‌నెవ‌రో కాదు వీజే స‌న్నీ. త‌ను గేమ్ బాగా ఆడుతున్నాడ‌ని, అయితే తాను ఎవ‌రినీ ప్ర‌భావితం చేయాల‌నుకోవ‌డం లేద‌ని చెప్పుకొచ్చాడు.

ఈ సీజ‌న్ విన్న‌ర్ అత‌నేనా? సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌!

అయితే వార్ వ‌న్‌సైడ్ అయ్యిందంటూ హార్ట్‌ సింబ‌ల్‌ని పోస్ట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక హౌస్‌లో వున్న స‌భ్యుల్లో చాలా మంది ప్రాణం పెట్టి ఆడుతున్నార‌ని. టాప్ ఫైవ్ కోసం భారీగానే క‌ష్ట‌ప‌డుతున్నార‌ని చెప్పుకొచ్చాడు రాహుల్‌. మ‌రి రాహుల్ చెప్పిన‌ట్టుగానే వీజే స‌న్నీ ఈ సీజ‌న్ వి.ఏత‌గా నిలుస్తాడో తెలియాలంటే మ‌రో రెండు వారాలు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.