English | Telugu

రుక్మిణిని స‌త్య‌కు ప‌ట్టించింది ఇదే!

శోభ‌న్ బాబు, శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `దేవ‌త‌` సినిమా స్ఫూర్తితో రూపొందించిన సీరియ‌ల్ `దేవ‌త‌`. అర్జున్ అంబ‌టి, సుహాసిని, వైష్ణ‌వీ రామిరెడ్డి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ బుధ‌వారం ఈ సీరియ‌ల్ 403వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. `ఇగో సారూ మీరు రాలేదు కానీ మేమంతా గుడికి వ‌చ్చాం తెలుసా` అంటుంది దేవి ఆదిత్య‌తో..

మీరంతా అంటే ఎవ‌రెవ‌రు వ‌చ్చార‌ని కంగారుగా అడుగుతాడు దేవిని ఆదిత్య‌. అమ్మా, నేను, చిన్మ‌య్‌, నాన‌మ్మ‌` అని చెబుతుంది దేవి. వెంట‌నే ఫోన్ స‌త్య‌కు ఇవ్వు అంటాడు. స‌త్య ఫోన్ తీసుకోవ‌డంతో `నాకు క‌డుపు నొప్పిగా వుంది ఇంటికిరా` అంటాడు ఆదిత్య‌. `దీపాలు పెట్టే వేళ అయింద‌ని ప‌ది నిమిషాల్లో బ‌య‌లుదేర‌తామ‌ని` చెబుతుంది స‌త్య‌. ఫోన్ పెట్టేసిన ఆదిత్య `ఛ‌.. ఇప్పుడు స‌త్య ..రాధ‌ని చూస్తే ప్ర‌మాదం అనుకుంటూ ప‌రుగులు పెడ‌తాడు.

ఆగ‌మేఘాల మీద గుడికి చేరిన ఆదిత్య అక్క‌డ రుక్మిణి, స‌త్య ఒక‌కి ఒక‌రు క‌నిపించేంత దూరంలో దీపాలు పెడుతుంటే చూసి ఆ ఇద్ద‌రికి అడ్డంగా నిల‌బ‌డ‌తాడు. `దీపాలు వ‌దిలేశావ్ క‌దా ఇక ఇంటికి ప‌దా అంటూ స‌త్య‌ని కంగారు పెడ‌తాడు. కారు ఎక్కి స‌త్య‌ని ఎక్క‌మంటాడు. ఈలోగా రుక్మిణి గ‌తంలో ఎక్కి వెళ్లిన కారు క‌నిపిస్తుంది. ఈ కారు ఇక్క‌డ వుందంటే అక్క ఇక్క‌డే వుండివుంటుంది అని ఆదిత్య‌కు చెప్ప‌కుండానే ప‌రుగులు పెడుతుంది. షాక్‌కు గురైన ఆదిత్య‌.. వెంట‌నే స‌త్య వెంట‌ప‌డ‌తాడు. గుడిలో రుక్మిణి కోసం వెతుకుతున్న స‌త్య‌కు తాను ఎదురుప‌డిందా?.. స‌త్య ఏం చేసింది? .. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.