English | Telugu

Shekhar basha: శేఖర్ బాషాపై ఆర్జీవీ బ్యూటీ సోనియా ఫైర్...

బిగ్ బాస్ గ్రాంఢ్ గా మొదలై మొత్తం ఏడు జోడీలుగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళారు. వారిలో వారికి అప్పుడే గొడవలు మొదలయ్యాయి. మొదటిది శేఖర్ బాషా, ఆర్జీవీ బ్యూటీ సోనియా ఆకుల మధ్య జరిగింది. అదేంటో ఓసారి చూసేద్దాం..

బిగ్ బాస్ వేకప్ సాంగ్ వేసాక అందరు డ్యాన్స్ చేసి వస్తారు. ఫుడ్, అండ్ గ్రాసరీ పంపిస్తారు బిగ్ బాస్. ఇక ఈ ఫుడ్ ని మీరు జాగ్రత్తగా వాడుకోవాలని కండిషన్ కూడా చెప్తాడు. ఆయితే కాసేపటికి శేఖర్ బాషా అండ్ బ్యాచ్ ఆరెంజెస్‌తో క్యాచ్‌లు ఆడుకోవడం మొదలెట్టారు. ఇది చూసిన ఆర్జీవీ బ్యూటీ సోనియా ఆకుల.. ఓ డైలాగ్ కొట్టింది. ఎవరు ఆరెంజెస్‌తో ఆడుతున్నారో వాళ్లెవరూ తర్వాత దాన్ని ముట్టుకోవడానికి లేదంటూ ఆర్డర్ వేసింది. అయిన ఫుడ్డుతో ఆడుకోవడమేంటి అంటూ ఫుల్ ఫైర్ అయ్యింది. దీనికి అందరూ సైడ్ అయిపోయిన శేఖర్ బాషా మాత్రం తన యూట్యూబ్ వాదనలు మొదలెట్టేశాడు. బిగ్‌బాస్ రూల్స్‌లో ఫుడ్డుతో ఆడకూడదని ఎక్కడైనా రాశాడా.. అయినా ఆరెంజెస్‌తో ఆడకూడదని చెప్పడానికి నీకేం రూల్ ఉందంటు శేఖర్ బషా ఎదురుతిరిగాడు. దీనికి అంతే స్ట్రాంగ్‌గా రిప్లయ్ ఇచ్చింది సోనియా. నీకు ఇచ్చిన ఫుడ్ ని నువ్వు కింద పడేసుకొని తిను, ఎక్కడైనా పడేసుకొని తిను నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు.. నీ ఫుడ్డును నువ్వు డ్రైనేజ్‌లో వేసుకొనైనా తిను.. నీ ఇష్టం అది..ఎవరైతే మనుషుల్లాగ తిందామనుకుంటున్నారో వాళ్లకి మాత్రం ఇవి పెట్టకండి అంటూ శేఖర్ పై సోనియా ఫుల్ ఫైర్ అయింది.

ఇక సోనియాకి శేఖర్ బాషా కూడా గట్టిగానే కౌంటర్ వేశాడు. ఇదేమైనా దేశ జెండానా.. దీనికి అంత గౌరవం ఇవ్వడానికి అంటూ ఏదేదో మాట్లాడాడు. ఫుడ్ అంటే అంతకంటే ఎక్కువే అంటూ మరో పంచ్ ఇచ్చింది సోనియా. అంటే ఇప్పుడు కిందపడిన దాన్ని తింటున్న నేను పశువునా.. నేను మనిషిని కాదా అంటూ చేతిలో ఉన్న ఆరెంజ్‌ను తినేశాడు శేఖర్ బాషా. ఇక హౌస్ లో మొదటి రోజే సోనియా, శేఖర్ బాషా గొడవపడ్డారు. వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది మీరే కామెంట్ చేయండి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.