English | Telugu

‘తంతా నా కొడకా..’ అంటూ బెదిరించిన నాగబాబు


జబర్దస్త్ ఎంత సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలుసు. ఈ షోలో స్కిట్స్ చేసిన వాళ్లంతా బిగ్ స్క్రీన్ మీద కూడా సినిమాలు చేస్తూ ఉన్నారు. అలాగే స్టేజి షోస్ , కామెడీ షోస్ చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి కమెడియన్స్ లో ముక్కు అవినాష్ ఒకరు. అవినాష్ స్కిట్ చేస్తే చాలు కడుపుబ్బా నవ్వుతారు ప్రేక్షకులు. మొదట్లో అవినాష్ స్కిట్స్ ఏమంత పేలకపోయినా తర్వాత్తర్వాత బాగా మెరుగుపరుచుకున్నాడు. బిగ్ బాస్ షో లో కూడా కంటెస్టెంట్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. దీనికి కారణం ఎవరు అంటే నాగబాబు గారు అంటాడు అవినాష్.

కొత్త కొత్త స్టోరీ లైన్స్ చెప్పి ఇలా చెయ్యి అలా చెయ్యి అంటూ మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారని చెప్పుకొచ్చాడు. పొరపాటున స్కిట్ లో తప్పు చేస్తే మాత్రం వెంటనే "తంతా నా కొడకా..ఇంకోసారి సరిగా చేయకపోతే " అంటూ బెదిరించేవారట. 'ఆయన వార్నింగ్‌ ఇస్తున్నందుకన్నా బాగా చేయాలి అని మేమంతా బాగా కష్టపడేవాళ్ళం' అంటాడు అవినాష్.

'ఈరోజు ఇంత నేం అండ్ ఫేమ్ వచ్చింది అంటే అదంతా నాగబాబు సర్ వ‌ల్లే. ఆయన అందరికి ఒక పెద్ద దిక్కుగా, ఒక తండ్రిగా ఉంటూ ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సాల్వ్ చేస్తాడని..నేను ఉన్నానంటూ ధైర్యం ఇస్తార'ని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు అవినాష్. నాగబాబుకి తనకి మధ్యన చక్కని రాపో ఉందని ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఆయనే అంటూ ఆనందం వ్యక్తం చేసాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.