English | Telugu

స్టోర్ రూమ్ లో బందీగా మ‌ల‌బార్ మాలిని!

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, ఆనంద్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. శుక్ర‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. పార్ట‌న‌ర్ ఇచ్చే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎక్క‌డ ర‌ద్ద‌వుతుందోన‌ని య‌ష్ త‌న‌తో కొంత సేపు భార్య‌గా న‌టించ‌మ‌ని వేద‌ని కోర‌తాడు.

దీంతో ఖుషీ కోసం వేద స‌రే అంటుంది. ఇద్ద‌రు క‌లిసి భోగిమంట‌ల్లో పిడ‌క‌లు వేస్తున్న దృశ్యాన్ని చూసిన వేద సోద‌రి త‌ల్లి పండితారాధ్యుల సులోచ‌నకు చెబుతుంది. దీంతో ఆగ్ర‌హించిన వేద త‌ల్లి సులోచ‌న అస‌లు త‌న వేద‌కు పెళ్లే కాలేద‌ని, య‌ష్ కు త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని య‌ష్ ని అడ్డంగా బుక్ చేస్తుంది. క‌ట్ చేస్తే.. శుక్ర‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌నుంద‌ని తెలుస్తోంది.

Also read:సుకుమార్ దర్శకత్వంలో ధనుష్!

అంత మంది ముందు య‌ష్ ని బుక్ చేసింద‌ని అత‌ని త‌ల్లి మ‌ల‌బార్ మాలిని .. వేద త‌ల్లి పండితారాధ్యుల సులోచ‌న‌పై ప‌గ ప‌డుతుంది. త‌న‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాల‌ని ఎద‌రుచూస్తూ వుండ‌గా మాలినికి ఎదురుప‌డుతుంది సులోచ‌న. దీంతో ఛాన్స్ దొరికింద‌ని వేద త‌ల్లిని దారుణంగా అవ‌మానిస్తుంది. అయితే త‌న‌కూ స‌మ‌యం దొరుకుతుంద‌ని ఎదురుచూసిన వేద త‌ల్లి.. మ‌ల‌బార్ మాలిని స్టోర్ రూమ్ లోకి వెళ్ల‌డం గ‌మ‌నించి త‌ను లోనికి వెళ్ల‌గానే త‌లుపులు మూసి గ‌డియ వేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? మ‌ల‌బార్ మాలిని ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొంది? ఆ విష‌యం తెలిసి య‌ష్ .. వేద‌తో గొడ‌వ‌కు దిగాడా? అన్న‌ది తెలియాలంటే శుక్ర‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.