English | Telugu

Guppedantha Manasu : శైలేంద్రని కలవనున్న సరోజ.. క్లైమాక్స్ ఎలా ఉందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1161 లో.. మీ అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలియదు? అని వసుధార అంటే.. అవును వసుధార.. రిషి అనేవాడికి మా అన్నయ్య గురించి పూర్తిగా తెలియదు.. కానీ రంగాకి అన్నయ్య నిజస్వరూపం మొత్తం తెలుసని అంటాడు. ఆ మాటతో వసుధార ఆశ్చర్యంగా చూస్తుంది. దాంతో రిషి.. ఏంటి వసుధారా.. కన్ఫ్యూజన్‌గా ఉందా?? చెప్పాను కదా.. నిన్ను కొన్నిరోజులు కన్ఫ్యూజన్‌లో ఉంచుతానని.. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా.. నేను రిషిలా చేయలేని పనులు రంగాగా చేయగలను కాబట్టే ఇంకా ఆ పాత్ర పోషిస్తున్నాను. ఇప్పుడు కూడా ఆ పాత్రలో నేను చక్కబెట్టాల్సిన పనులు చాలానే ఉన్నాయి. అవి రంగాగానే చేస్తానని అంటాడు.

ఇంకెన్నాళ్లు సర్.. ఈ ముసుగు అని వసుధార అంటే.. కథ ముగింపుకి వచ్చేసరికి క్యారెక్టర్లు బయటపడతాయి కదా.. ఆ సమయం దగ్గరలోనే ఉంది.. చూస్తూనే ఉండమని రిషి అంటాడు. ఇక రిషి చూడమన్నాడు కాబట్టి.. వసుధార అలా శూన్యంలోకి చూస్తుంటుంది. నేను చూడమన్నది శూన్యంలోకి కాదు వసుధారా.. ఆ నక్షత్రాలను చూడమని వసుధారకి చుక్కలు చూపిస్తాడు వసుధార. మరోవైపు బుజ్జిని సరోజ కలుస్తుంది. ఆ వసుధార మా బావని తీసుకెళ్ళిందా అని సరోజ అడుగగా.. లేదు రంగానే వసుధారని తీసుకెళ్ళాడని బుజ్జి చెప్తాడు.దాన్ని కనిపెట్టాలి.. మనం వెళ్లి శైలేంద్రని కలిస్తే అన్నీ తెలుస్తాయి. ముందు నేను వెళ్లి శైలేంద్రని కలవాలని సరోజ బయల్దేరుతుంది. కాసేపటికి బుజ్జి దగ్గరకి రిషి వస్తాడు. నానమ్మ నీపై బెంగపెట్టుకుందన్నా.. మందులు కూడా వేసుకోవడం లేదు. ఆ సరోజ అయితే ఆరాలు తీస్తుంది.. అంతా నువ్వు చెప్పినట్టే చేశా కానీ.. ఆ సరోజ శైలేంద్రని కలుస్తుంది అని చెప్తాడు బుజ్జిగాడు. దాంతో రిషి.. సరోజ వెళ్లి ఆ శైలేంద్రని కలవాలి.. కలిసేట్టు నువ్వు చెయ్ అని రిషి అంటాడు. అయితే వీళ్ల మాటల్ని వసుధార చాటుగా వింటూ ఉంటుంది. రిషి సర్ ఏం చేయబోతున్నారు? ఎందుకు శైలేంద్రని సరోజ కలిసేట్టు చేస్తున్నారని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇంతలో బుజ్జిగాడు.. రిషి వైపు అనుమానంగా చూసి.. అన్నా నువ్వు రంగావి కాదు కదా అని అడుగుతాడు.

నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదురా.. ఎక్కువ ఊహించుకోకు. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడొద్దని రిషి అంటాడు. మాట్లాడొద్దని అంటున్నావంటే.. అదే నిజం కదా.. ముసల్ది నీపై ప్రాణం పెట్టుకుంది అన్నా.. ప్లీజ్ అన్నా.. నిజం చెప్పు.. నేను ఎవరికీ నిజం చెప్పనని బుజ్జి రిక్వెస్ట్ చేయగా.. నేను తరువాత మాట్లాడతాను.. నానమ్మ జాగ్రత్త అని సమాధానం దాటవేస్తాడు. ఇతను రిషి అయితే మా రంగా ఎక్కడున్నాడని బుజ్జి ఆలోచనలో పడతాడు. ఎక్కువ ఆలోచించకురా బుజ్జి.. నువ్వు ప్రశాంతంగా వెళ్లమని బుజ్జిని అక్కడ నుంచి పంపించేస్తాడు రిషి. అయితే అసలు రిషినా? రంగానా? అని అనుమానంలో వసుధార ఉండిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.