English | Telugu

మీ అత్తతో జాగ్రత్త నన్ను వాడుకుంది.. రామలక్ష్మి ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -172 లో..ఇకనైనా నీ ప్రయత్నం ఆపి ఒక మూలన కూర్చోమని శ్రీలతకు రామలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఏమైందని అలా అంటున్నావని శ్రీలత అడుగగా.. మీరు ఎంత బాగా నటిస్తారు మహానటి. నమితతో అంతా చేయించి ఏం తెలియనట్లు భళే మాట్లాడుతున్నారని రామలక్ష్మి అంటుంది. నేను ఎందుకలా చేస్తానని శ్రీలత అంటుంది. నాకు అర్థం అయింది నమిత చెప్పకపోయిన మిమ్మల్ని చూసి భయపడడంలోనే నాకు అర్థమైందని రామలక్ష్మి అంటుంది. నీ భర్త నిన్ను బయటకు గెంటేలా ప్లాన్ చేస్తానని శ్రీలత అంటుంది. ఆ లోపే నేను ఒక బిడ్డని కంటాను.. అప్పుడు మీ కపట ప్రేమకి దూరం అయి, ఆ బిడ్డకి దగ్గర అవుతారని శ్రీలతతో రామలక్ష్మి అంటుంది.

ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వెళ్తుంది. నీ లక్ష్యం ఆశయాలు పక్కన పెట్టి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నావని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. మీ ప్లాన్ ఫెయిల్ అయింది. మా ఆశలపై నీళ్లు చల్లారని శ్రీవల్లి అంటుంది. అవును నువ్వు నన్ను చైర్మన్ చేస్తానంటూ ఆశలు పెట్టావని సందీప్ అంటాడు. అది జరుగుతుంది కచ్చితంగా.. సీతాకాంత్ పై మచ్చ పడింది.. అది చాలు.. బోర్డు మెంబర్స్ అందరు నా మాట వినేలా చేస్తాను.. చైర్మన్ ని చేస్తానని శ్రీలత అంటుంది.

ఆ తర్వాత సీతాకాంత్ కి రామలక్ష్మి భోజనం వడ్డీస్తుంది. రామలక్ష్మి కూడా సరిగ్గా తినలేదని పెద్దాయన చెప్పిన మాటలు సీతాకాంత్ గుర్తుచేసుకొని.. నువ్వు కూడా తిను అంటూ రామలక్ష్మికి తినిపిస్తాడు. ఆ తర్వాత నమిత తను ఏ కారణం వల్ల అలా చేసిందో తెలియదు కానీ మీరు బయటకు రావడానికి కారణం తనే కాబట్టి మళ్ళీ తనని క్షమించి లైఫ్ ఇవ్వండి అని రామలక్ష్మి అడుగగా.. సరే అంటాడు.

ఆ తర్వాత రామలక్ష్మి నమితని కలుస్తుంది. థాంక్స్ మేడమ్.. నేను తప్పు చేసిన మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చారని నమిత అంటుంది. మీ అత్తతో జాగ్రత్త నన్ను వాడుకున్నారని జరిగింది చెప్తుంది.. ఇక ఇప్పుడు మీకు సహాయం చెయ్యలేకపోవచ్చు కానీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మాత్రం కచ్చితంగా హెల్ప్ చేస్తానని రామలక్ష్మికి నమిత చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.