English | Telugu

బిందుమాధ‌వి దెబ్బ‌.. అఖిల్ అబ్బా!

బిగ్‌బాస్ హ‌ద్దులు దాటుతోంద‌ని తొలి సీజ‌న్ నుంచే విమ‌ర్శ‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక అంత‌కు మించి అన్న‌ట్టుగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో ర‌చ్చ చేయించాల‌ని ఫిక్స‌య్యారో ఏమో తెలియ‌దు కానీ బిగ్ బాస్ ఓటీటీ మాత్రం నిజంగానే హ‌ద్దులు దాటేసి ప‌రాకాష్ట‌కు చేరుకుంటోంది. కంటెస్టెంట్ లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు సీజ‌న్ ఎండింగ్ కు వ‌స్తున్న కొద్దీ మ‌రీ దారుణంగా మారుతోంది. ఇందులో ఏడ‌వ వారం ఎలిమినేష‌న్ లో బిందు మాధ‌వి, అఖిల్ ల మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణే ఇందుకు అద్దంప‌డుతోంది. ఈ వీకెండ్ లో నాగార్జున ఏకంగా ఇద్ద‌రిని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఏడ‌వ వారం ఎలిమినేష‌న్స్ ని ప్రారంభించేశారు. ఇక ఈ ఎలిమినేష‌న్ మ‌రింత ర‌చ్చ ర‌చ్చ‌గా సాగాల‌ని బిగ్ బాస్ అనుకున్నాడో ఏమో కానీ అంత‌కు మించి అన్న‌ట్టుగానే ఈ నామినేష‌న్ ల ప్ర‌క్రియ మ‌రింత ర‌చ్చ‌కు తెర‌లేపింది. హ‌ద్దులు దాటి కంటెస్టెంట్ లు ఒరేయ్.. ఒసేయ్ అనే స్థాయికి దిగ‌జారింది. ఎవ‌రి మ‌ధ్య అయితే గొడ‌వ పీక్స్ కి చేరుకుంటుందో అదే జంట మ‌ధ్య బిగ్ బాస్.. నామినేషన్స్ పేరుతో మంట పెట్టేశాడు. అది ఓ రేంజ్ లో అంటుకుని అరేయ్ తురేయ్ అనే దాకా వెళ్లింది.

'నీ కంటే నేనే బెస్ట్' అంటూ అఖిల్ ముందు మొద‌లుపెట్టాడు. త‌రువాత బిందు ఆడుకుంది. `మీది మీదికి వ‌చ్చింది నువ్వు. ఈ ఇంట్లో వుండే హ‌క్కు నీకెంత వుందో నాకు అంత‌కంటే ఎక్కువ వుంది. ప‌క్క‌కిపో ప‌క్క‌కి పో అంటే నేనెందుకు పోతా..' అంటూ అఖిల్ కి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది. అయితే ఈ డిస్క‌ష‌న్ లో బిందు మాధ‌విని అఖిల్ 'పండు.. బుజ్జి..వెళ్లి కుర్చీలో కూర్చో' అని వెట‌కారంగా అనడంతో బిందు మాధ‌వి రెచ్చిపోయింది... 'అరేయ్ అఖిల్ గా ఏంట్రా.. చెప్పురా..' అంటూ షాకిచ్చింది. దీంతో అఖిల్ 'నా వ‌ల్ల కాదు' అంటూ చేతులెత్తేశాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.