English | Telugu

జ‌బ‌ర్ద‌స్త్ కు రోజా గుడ్ బై!

బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ ల‌కు న‌టి, పొలిటికల్ లీడ‌ర్ రోజా జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఆమెతో పాటు మ‌నో కూడా గ‌త కొంత కాలంగా ఈ షోల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. అయితే గ‌త కొన్ని వారాలుగా రోజా త‌న పాత్ర‌ని త‌గ్గించుకుంటూ ఒక‌నాటి త‌న స‌హ తార‌లైన‌ ఆమ‌ని, లైలాల‌కు చోటు క‌ల్పిస్తూ వారికి ప్రాధాన్య‌త‌నిస్తూ వ‌చ్చారు. ఏపీ మంత్ర వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రోజాకు చోటు ద‌క్క‌నున్న నేప‌థ్యంలోనే ఆమె త‌న జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల‌లో త‌న పాత్ర‌ని త‌గ్గించుకుంటూ వ‌స్తున్నార‌ని వార్త‌లు వినిపించాయి.

రోజా కూడా ఇందుకు అనుగుణంగానే అడుగులు వేస్తూ వ‌చ్చారు. ఫైన‌ల్ గా రోజాకు ఏపీ మంత్రివ‌ర్గంలో అంతా ఊహించిన‌ట్టుగానే మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. దీంతో ఆమె జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల‌లో మునుప‌టి త‌ర‌హాలో కంటిన్యూ కావ‌డం క‌ష్ట‌మ‌నే వార్త‌లు జోరందుకున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ షోల‌కు లైలా, ఆమని మాత్ర‌మే జ‌డ్జీలుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలుస్తోంది. ఈ వార్త‌ల‌ని నిజం చేస్తూ రోజా సోమ‌వారం అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఏపీ మంత్రివ‌ర్గంలో త‌న‌కు చోటు ద‌క్కిన నేప‌థ్యంలో ఇక‌పై షూటింగ్ ల‌కు వెళ్ల‌న‌ని, అన్ని షోల‌ని తాను మానేస్తున్నాన‌ని ప్ర‌క‌టించి షాకిచ్చారు రోజా. ఇక‌పై టీవీ షోల షూటింగ్ ల‌లో తాను పాల్గొన‌ని, సీఎం జ‌గ‌న్ ఇచ్చిన గుర్తింపుని ఎప్ప‌టికీ మ‌ర్చిపోన‌ని, త‌న‌ను అసెంబ్లీలోకి అడుగుపెట్ట‌నివ్వ‌న‌ని చంద్ర‌బాబు అంటే జ‌గ‌న‌న్న త‌న‌ని రెండు సార్లు ఎమ్మెల్యేని చేశార‌ని, ఇప్ప‌డు మంత్రిని చేస్తున్నార‌ని రోజా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా వైఎస్ జ‌గ‌న్ మ‌హిళా ప‌క్ష‌పాతిగా కేబినెట్ లో మంత్రిగా త‌న‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం త‌న‌ అదృష్టం అని తెలిపారు రోజా. దీంతో జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ అభిమానులు రోజా లేకుండా ఈ కార్య‌క్ర‌మం బోసిపోతుందేమో అని ఆందోళ‌న చెందుతున్నార‌ట‌.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.