English | Telugu

బేబీ సినిమాలో సీత...బూతులతోనే ఫేమస్

బిగ్ బాస్ సీజన్ 8 ఏడు జంటలు, పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. అయితే ఇందులో ఎవరు ఎంటనేది టీవీలో చూసిన ప్రేక్షకులకి అర్థమవుతుంది. శేఖర్ భాషా, బెజవాడ బేబక్క, యష్మీ గౌడ, ప్రేరణ కంభం, సీరియల్ యాక్టర్ నిఖిల్, అభయ్ నవీన్, పృథ్వీరాజ్, కిరాక్ సీత, సబీల్ ఆఫ్రిదీ, నాగ మణికంట, నైనిత, విష్ణుప్రియ, సోనియా, ఆదిత్య ఓమ్ బిగ్ బాస్ గ్రాంఢ్ లాంచ్ లో హౌస్ లోకి వెళ్ళారు.

ఇక హౌస్ లోకి వెళ్ళిన వారి ఒక్కొక్కరి ఏవీలో చాలా డెప్త్ ఉంది. అయితే వారిలో కిర్రాక్ సీత ఏవీ ఇంప్రెసివ్ గా ఉంది. కిర్రాక్ సీత అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ 7 ఆర్ట్స్ సీత, బేబీ సినిమాలో సీత అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు.రాయలసీమ నంద్యాలలో పుట్టి పెరిగిన సీత తర్వాత హైదరాబాద్‌ షిఫ్ట్ అయింది.ఆమె తండ్రి దూరదర్శన్‌లో పనిచేసేవారు. ఇక నటనపై ఇంట్రెస్ట్‌తో అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేసింది సీత. కానీ ఎక్కడా దొరక్కపోవడంతో చివరికి 7 ఆర్ట్స్‌లో పని చేసింది. 7 ఆర్ట్స్ అంటేనే బోల్డ్ కంటెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో 7 ఆర్ట్స్ సరయు కూడా బిగ్‌బాస్‌లో సందడి చేసింది.7 ఆర్ట్స్‌లో చాలా కాలం పని చేసిన తర్వాత సీతకి బేబీ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ చిత్రంతోనే ఈమెకి బ్రేక్ వచ్చింది.

ఇక పలు ఇంటర్వ్యూల్లో తన గురించి పలు విషయాలు పంచుకుంది సీత. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఐదేళ్లు ఓ అబ్బాయితో రిలేషనల్‌లో ఉన్నానని కానీ బ్రేకప్ అయిపోయిందంటూ కూడా చెప్పింది. సీతకి కూచిపూడి, భరతనాట్యం కూడా వచ్చు. సినిమాల్లోకి రావడం కోసం ట్రై చేయడానికి ఇంట్లో వాళ్ల దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోకుండా తన ఖర్చు మొత్తం తనే సంపాదించుకొని, చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింది సీత. మరి బిగ్‌బాస్‌లో ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.