English | Telugu

బేబక్క నామినేషన్ తో హర్ట్ అయిన పృథ్వీరాజ్ .. నీ వాయిస్ వినిపించడం లేదు!

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు గ్రాండ్ గా లాంఛ్ అయింది. ఇక నామినేషన్ల ప్రక్రియతో కంటెస్టెంట్స్ మధ్య చిచ్చుపెట్టాడు బిగ్ బాస్.

అయితే సోనియా నామినేషన్ల ప్రక్రియ మొదలెట్టగా.. తను ప్రేరణ, బేబక్కని నామినేట్ చేయగా ఛీఫ్ లలో ఉన్న యష్మీ తన ఫ్రెండ్ ప్రేరణనని సేవ్ చేసింది. ఆ తర్వాత నబీల్ ఆఫ్రిదీ, పృథ్వీరాజ్ లని బేబక్క నామినేట్ చేసింది. హౌస్ లో నీ వాయిస్ వినపడం లేదని, యాక్టివ్ పార్టిసిపేషన్ లేదంటూ నబీల్ ని నామినేట్ చేసింది బేబక్క.

ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేసింది బేబక్క. కాఫీ కావాలన్నా ఏం కావాలన్నా మీరు అడుగుతున్నారు కానీ కిచెన్ లో ఉన్నవాళ్ళకి అంతగా హెల్ప్ చేయడం లేదు.. మీరు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ మాకు సాయం చేయడం లేదంటూ రీజన్ చెప్పింది బేబక్క. దీనికి పృథ్వీ అదేంటి నేను కిచెన్ డిపార్ట్‌మెంట్ కాదు కదా.. అయిన మీరు నన్ను సాయం అడిగితే చేసేవాడిని అంటూ చెప్పాడు. ఇంతలో "గిన్నెలు కడిగావు కదా చెప్పు.." అంటూ పృథ్వీతో సీత అంది. గిన్నెలు కడిగాడు, వెజిటేబుల్స్ కోసి ఇచ్చాడు కూడా అంటూ సీత మధ్యలో మాట్లాడింది. దీంతో చీఫ్ నిఖిల్ మధ్యలో దూరి నువ్వు మాట్లాడొద్దంటూ సీతపై అరిచాడు. ఈ దెబ్బతో సీత ఫైర్ అయింది. నా ఇష్టం నేను మాట్లాడతా.. నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా అంటూ గట్టిగానే గొడవ పెట్టుకుంది. ఇక చివరికి ఒక్క కాఫీ కోసం నామినేట్ చేశారా అంటూ బేబక్కని అడిగాడు పృథ్వీ. ఇంకా నామినేషన్ చేసేవాళ్ళు సగానికి పైగా ఉన్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.