English | Telugu

Bigg Boss 9 Telugu : భరణి కోసం మాధురి డ్యాన్స్.. అతనికి మాత్రమే సపోర్ట్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం ఒక్కొక్కరి ఆటతీరు ఒక్కోలా ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. భరణికి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. అతనే కెప్టెన్సీ కంటెండర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. భరణి, దివ్య, తనూజ, శ్రీనివాస్ సాయి, నిఖిల్ కెప్టెన్సీ కంటెండర్స్ గా భరణి సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక టాస్క్ విషయానికి వస్తే ఎవరు పేరు అయితే పిలుస్తారో వాళ్ళు వెళ్లి స్టేజ్ పై డాన్స్ చెయ్యాలి.. మరొక స్టేజ్ పై తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి అలా సాంగ్ సాగేవరకూ ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు స్టేజ్ పై ఎంత మంది ఉంటారో వాళ్ళని లెక్కలోకి తీసుకొని ఎక్కువ మంది సపోర్ట్ కలిగి ఉవన్నవాళ్లు కెప్టెన్ అవుతారు.

అలా కంటెండర్స్ అందరు తమకు సపోర్ట్ చెయ్యమని హౌస్ మేట్స్ ని అడుగుతారు. మాధురి దగ్గరికి భరణి వెళ్తాడు. నాకూ సపోర్ట్ చెయ్యండి నా కోసం డాన్స్ చెయ్యండి అని మాధురిని భరణి రిక్వెస్ట్ చేస్తాడు.

అలా మొదట ఛాన్స్ శ్రీనివాస్ సాయికి వస్తుంది. తనకి సపోర్ట్ గా ఒక్కరు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత దివ్యకి ఛాన్స్ రాగా దివ్య కి సపోర్ట్ గా అయిదుగురు ఉంటారు. ఆ తర్వాత నిఖిల్ కి సపోర్ట్ గా ముగ్గురు ఉంటారు. భరణి కి నలుగురు ఉంటారు‌. భరణికి సపోర్ట్ చెయ్యాలని మాధురి స్టేజ్ పైకి వెళ్తుంది కానీ రీతూ కిందకి లాగేస్తుంది.


చివరగా తనూజ ఉంటుంది. తనకి ఎనమిది మంది ఉంటారు... బిగ్ బాస్ టాప్-2 ఉన్నవాళ్లు ఫైనలిస్ట్ గా సెలెక్ట్ చేస్తాడు. కాసేపటికి ఫైనల్ తనూజ, దివ్యల మధ్య కెప్టెన్సీ పోటీ జరుగుతుంది. ఇద్దరికి చెరొక ఆరుగురు సపోర్ట్ చేస్తూ స్టేజ్ పై ఉంటారు. ఎవరికి సపోర్ట్ చెయ్యకుండా భరణి సైలెంట్ గా మిడిల్ లో ఉంటాడు. తనూజ టీమ్ నుండి నిఖిల్ కిందకి వస్తాడు. ఇక ఎక్కువ సపోర్ట్ ఉన్న దివ్య కెప్టెన్ అవుతుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.