English | Telugu

బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో వివాదం కాదుగా..

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దీని కార‌ణంగా కొన్ని జంట‌లు విడిపోవ‌డం.. కొంత మంది మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డం తెలిసిందే. అయితే ఈ షో ఎంత వివాదాల‌ని సృష్టించిందో అంతే పాపులారిటీని కూడా సొంతం చేసుకుంది. ఇప్ప‌టికీ అదే పంథాని కంటిన్యూ చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా బిగ్‌బాస్ ఓటీటీలోనూ ప్ర‌సారం కాబోతోంది. అయితే ఈ సారి ట్రెండ్ మార్చారు. గంట నిడితో కాకుండా 24 గంట‌లు స్ట్రీమింగ్ కాన్సెప్ట్ తో వ‌స్తున్నారు.

తాజాగా ఓటీటీ బిగ్‌బాస్ షోకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ఓటీటీ బిగ్‌బాస్ షోకు కూడా నాగార్జున‌నే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రింస్తున్నారు. నాగార్జున‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీశ‌ర్మ‌ల‌పై బిగ్‌బాస్ ఓటీటీ ప్ర‌మోష‌న‌ల్ ప్రోమోని వ‌దిలారు. ఇందులో వెన్నెల కిషోర్ దొంగ పొర‌పాటున ఓ వ్య‌క్తిని మ‌ర్డ‌ర్ చేస్తాడు. అత‌న్ని ప‌ట్టుకున్న ముర‌ళీశ‌ర్మ కోర్టులో హాజ‌రు ప‌రిస్తే అత‌ని త‌రుపున వాదించే లాయ‌ర్ గా నాగార్జున క‌నిపించారు. ఫైన‌ల్ గా వెన్నెల కిషోర్ కి కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది.

అత‌ని శిక్ష‌ని ఎలాగైనా త‌ప్పించాల‌ని ప్ర‌య‌త్నించే లాయ‌ర్ నాగార్జున అత‌ని చివ‌రి కోరిక‌గా బిగ్‌బాస్ ఎపిసోడ్ ని చూపించండి అని ముర‌ళీశ‌ర్మ‌ని కోర‌తాడు. గంటే క‌దా అని ఓకే అంటాడు. కానీ ఇది 24 గంట‌లలు స్ట్రీమింగ్ అయ్యే షో కావ‌డంతో ఎంత‌కీ పూర్త‌వ్వ‌దే అని ముందు అస‌హ‌నం వ్య‌క్తం చేసినా ఆ త‌రువాత వెన్నెల కిషోర్‌, నాగార్జున‌తో క‌లిసి త‌ను కూడా చూడ‌టం మొద‌లుపెడ‌తాడు. ఉరిశిక్ష వేయాల్సిన త‌లారీ, శిక్ష వేసిన జ‌డ్జి, సెంట్రీగా వుండాల్సిన పోలీసులు కూడా క‌ర్త‌వ్యాన్ని ప‌క్క‌న పెట్టి షోని చూడ‌టం మొద‌లుపెడ‌తారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది.

Also Read : 'బిగ్ బాస్' ఫేమ్ 'సరయు' అరెస్ట్!

ఇలాంటి ప్రోమోల‌పై విమ‌ర్శ‌లు త‌లెత్తుతున్న విష‌యం తెలిసిందే. మ‌రి బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో కూడా వివాదం అయ్యే అవ‌కాశాలు వున్నాయ‌ని చెప్పుకుంటున్నారు. బిగ్‌బాస్ ఓటీటీ షో ఈ నెల 26 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.