English | Telugu

న‌య‌ని ప్ర‌యోగం ఫ‌లించిందా?

బుల్లితెరపై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. జ‌క‌గ‌బోయేది ముందే గ‌మ‌నించే ఓ అమ్మాయి చుట్టూ జరిగే ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా ఈ సీరియ‌ల్ బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. క‌న్న‌డ న‌టీన‌టులు చందు గౌడ‌, అషిక గోపాల్ ప‌డుకోన్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో అనిల్ చౌద‌రి, చ‌ల్లా చందు, నిహారిక‌, ప్రియాంక చౌద‌రి, విష్ణు ప్రియ‌, జ‌య‌రామ్ ప‌విత్ర‌, శ్రీ స‌త్య‌, భావ‌నా రెడ్డి న‌టించారు.

గ‌త కొన్ని వారాలుగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో ఈ సీరియ‌ల్ సాగుతోంది. ప్ర‌మాదం కార‌ణంగా క‌ళ్లు పోగొట్టుకున్న విశాల్ కు మ‌రో వ్య‌క్తి క‌ళ్ల‌ని దానం చేయ‌డం వాటిని విశాల్ కు పెడ‌తారు. అప్ప‌టి నుంచి గ‌తం మ‌ర్చిపోయిన విశాల్ త‌న భార్య న‌య‌న‌ని త‌ప్ప అంద‌రిని గుర్తుంచుకుంటాడు. దీంతో త‌న భ‌ర్త‌కు గ‌తం గుర్తు చేయాల‌ని న‌య‌న ప్ర‌య‌త్నాలు చేస్తుంటుంది. ఈ క్ర‌మంలో త్రిన‌య‌నిలా మారి విశాల్ కు గ‌తం గుర్తు చేయాల‌ని ఏర్పాట్లు చేస్తుంది.

Also Read:య‌ష్ - వేద‌ల పెళ్లి .. మాళ‌విక‌కు తెలిసిపోతుందా?

ఇది విశాల్ స‌వ‌తి త‌ల్లికి ఏ మాత్రం న‌చ్చ‌దు. ఎక్కడ గ‌తం గుర్తుకొస్తే త‌న జీవితం ముగిసిపోతుందోన‌ని న‌య‌న‌ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. అయినా న‌య‌నికి ఇంట స‌భ్యుల స‌హ‌కారం ల‌భించ‌డంతో పుట్టిన రోజు అని అబ‌ద్ధం చెప్పి విశాల్ కు గ‌తం గుర్తొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. విశాల్ ని తొలిసారి క‌లిసిన సంద‌ర్భంలో ఎలాంటి వేష‌ధార‌ణ‌తో వుందో మ‌ళ్లీ అదే వేష‌ధార‌ణ‌తో రెడీ అయి వ‌స్తుంది న‌య‌ని. దీంతో ఏదో చేయ‌బోతోంద‌ని విశాల్ స్టెప్ మ‌ద‌ర్ భ‌య‌ప‌డుతూ వుంటుంది.

ఈ క్ర‌మంలోనే విశాల్ త‌ల‌పై క‌ర్ర‌తో కొడ‌తుంది న‌య‌న‌. అది చూసి షాక్ అయిన విశాల్ త‌ల్లి న‌య‌న‌ని ఇంటి నుంచి త‌రిమేయాల‌ని చూస్తుంది.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? విశాల్ కు గ‌తం గుర్తొచ్చిందా? .. న‌య‌ని ప్ర‌యోగం ఫ‌లించిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.