English | Telugu

Bigg Boss 9 Telugu voting 13th week: పదమూడో వారం డేంజర్ జోన్ లో‌ ఆ ఇద్దరు.. టఫ్ ఎలిమినేషన్!

బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం నామినేషన్లో‌ ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇమ్మాన్యుయేల్, కెప్టెన్ కళ్యాణ్ మినహా అందరు నామినేషన్లో ఉన్నారు. ఇక శుక్రవారం అర్థరాత్రి వరకు సాగే ఈ ఓటింగ్ లో నిన్నటి వరకు జరిగిన ఓటింగ్ బట్టి ఎవరు టాప్ లో ఉన్నారో.. ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం.

తనూజ టాప్ ఓటింగ్ తో దూసుకెళ్తోంది. 28.24 శాతం ఓటింగ్ తో తనూజ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 15.4 శాతం ఓటింగ్ తో డీమాన్ పవన్ రెండో స్థానంలో ఉన్నాడు. 15.14 శాతం ఓటింగ్ తో భరణి మూడో స్థానంలో ఉన్నాడు. 14.16 శాతం ఓటింగ్ తో రీతూ చౌదరి నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఇక సుమన్ శెట్టి, సంజన గల్రానీ ఇద్దరు 13 శాతం ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్నారు. అన్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం సంజన ఎలిమినేట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు సంజన, సుమన్ శెట్డిలకే బిగ్ బాస్ ఫుల్ సపోర్ట్ ఉంది. పన్నెండు వారాలుగా హౌస్ లో వీళ్ళిద్దరు ఏ గేమ్ ఆడకపోయినా, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వకపోయినా తనని హౌస్ లో ఉంచుతూ వచ్చాడు బిగ్ బాస్. అయితే సంజన, సుమన్ శెట్టిలు హౌస్ లో ఉండటం వల్ల స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి డీమాన్ పవన్ కి అన్యాయం జరుగుతుంది.

ప్రతీసారీ టాస్క్ లో బెస్ట్ ఇచ్చే కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. ‌ఎందుకంటే హౌస్ లో ఎంత పర్ఫామెన్స్ ఇచ్చినా ఓటింగ్ లో సుమన్ శెట్టి, సంజన ఉంటే మెజారిటీ ఓటింగ్ వారిద్దరికే పడుతోంది. అయితే ఈ వారం వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేషన్ అవుతారు. ఒకవేళ వీరిద్దరిని కాకుండా రీతూని ఎలిమినేషన్ చేసే అవకాశం కూడా ఉంది. మరి నామినేషన్లో ఉన్నవారిలో మీ ఓట్ ఎవరికో కామెంట్ చేయండి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.