English | Telugu

Bigg Boss 9 Telugu: సంజనని కెప్టెన్సీ రేస్ నుండి తీసేసిన రీతూ.. పొడిచేసిందిగా!

బిగ్ బాస్ హౌస్ లో ఈ వీక్ మొత్తం ఎక్స్ కంటెస్టంట్స్ ని లోపలికి పంపించి టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. టాస్క్ లో గెలిచిన కంటెస్టెంట్సే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. అందులో భాగంగా కెప్టెన్సీ రేస్ లో లేని ముగ్గురు అయిన భరణి, తనూజ, సుమన్, ముగ్గురు బజర్ మోగినప్పుడు ముందు వెళ్లి డ్రాగన్ పట్టుకొని మీకు ఎవరైతే కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి డ్రాగన్ ఇవ్వాలి. వాళ్ళు కెప్టెన్ అవద్దనుకున్న వాళ్ళకి గుచ్చుతారని బిగ్ బాస్ చెప్పాడు.

మొదట బజర్ మోగినప్పడు సుమన్ వెళ్లి డ్రాగన్ పట్టుకొని రీతూ కి ఇస్తాడు. తను సంజనని కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగిస్తుంది. మీరు కెప్టెన్ కాకపోతేనే ఇలా మాటలు వదిలేస్తున్నారు.. ఇప్పుడు కెప్టెన్ అయితే ఇంకెలా మాట్లాడతారో అని రీతూ రీజన్ చెప్తుంది. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది.. మీరు రోజు చేసే పనే కదా చెప్పాను. ప్రొద్దున లేస్తావ్.. గొడవ పడుతావ్.. అలుగుతావు.. దూరం వెళ్తారు.. మళ్ళీ ఇద్దరు ప్యాచప్ అవుతారు. ఇంతకు మించి నువ్వు ఏం చేస్తున్నావ్ చెప్పమని సంజన అడుగతుంది.

Also Read:బిగ్ బాస్-9 చివరి కెప్టెన్ ఎవరంటే..?

నీ కోసం సాక్రిఫైజ్ చేసాను.. మా నాన్న షర్ట్ వదిలేసి మరి అని రీతూ అంటుంది. నువ్వు షర్ట్ తీసుకోవడం వల్లే నా చీరలు అన్నిపోయాయని సంజన అంటుంది. అది కాదు నేను షర్ట్ ఇవ్వడం వల్లే నీకు చీరలు వచ్చాయి గుర్తు పెట్టుకోమని రీతూ అంటుంది. అసలు నా హెయిర్ కట్ చేసి సాక్రి ఫైజ్ చేసాను.. ఎందుకు చేసానా అని ఇప్పుడు అనిపిస్తుందని రీతూ అంటుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవలో ఇమ్మాన్యుయల్ టాపిక్ వస్తుంది. దాంతో తను ఇన్వాల్వ్ అవుతాడు. కాసేపు రీతూ, ఇమ్మాన్యుయల్ మధ్య గొడవ జరుగుతుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.