English | Telugu

అఖిల్ - అషురెడ్డి మ‌ధ్య అస‌లు క‌థ షురూ

ప్ర‌తి బిగ్ బాస్ సీజ‌న్ లో ఇద్ద‌రు కంటెస్టెంట్ ల మ‌ధ్య ల‌వ్ స్టోరీని స్టార్ట్ చేయ‌డం దాంతో షోని కొత్త మ‌లుపులు తిప్ప‌డం అల‌వాటుగా మారింది. దీని వ‌ల్ల ఇటీవ‌ల రెండు రియ‌ల్ జంట‌లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కున్నారు కూడా. అందులో ఓ జంట ఏకంగా బ్రేక‌ప్ కూడా చెప్పేసుకుని నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఫేక్ జంట‌ల‌ని సృష్టించి రియ‌ల్ జంట‌ల‌ని టార్చ‌ర్ చేసే ఈ సంస్కృతిపై ఇప్ప‌టికే నెటిజ‌న్ లు దుమ్మెత్తిపోస్తూనే వున్నారు. అయినా బిగ్ బాస్ నిర్వాహ‌కుల్లో మాత్రం ఈ విష‌యంలో ఎలాంటి మార్పు రావ‌డం లేదు.

ఇటీవ‌ల 24 గంట‌ల స్ట్రీమింగ్ పేరుతో బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ వెర్ష‌న్ ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి దాకా కంటెస్టెంట్ ల‌ని గ్రూపులుగా విడ‌దీసి కొట్టుకుంటుంటే వినోదం చూసిన బిగ్ బాస్ ఇప్పుడు కొత్త‌గా ల‌వ్ ట్రాక్ ల‌ని స్టార్ట్ చేశాడు. సీజ‌న్ 4 లో అఖిల్ - మోనాల్ ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ స్టార్ట్ చేయించి ర‌చ్చ ర‌చ్చ చేసిన బిగ్ బాస్ మ‌ళ్లీ ఓటీటీలోనూ అదే ఫార్ములాని ఫాలో అయిపోతున్నాడు. అయితే ఇక్క‌డ అఖిల్ - అషురెడ్డిల మ‌ధ్య కొత్త‌గా ల‌వ్ ట్రాక్ ని స్టార్ట్ చేయ‌డంతో ఇప్పుడు బిగ్ బాస్ పై సెటైర్లు వినిపిస్తున్నాయి.

వ‌ర్మ‌తో అషురెడ్డి చేసిన వీడియోలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అలాంటి అషు - అఖిల్ ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ అంటే ర‌చ్చ ర‌చ్చే. ఇప్ప‌డు ఓటీటీ బిగ్ బాస్ షో ఈ విచిత్ర ల‌వ్ ట్రాక్ కి వేదిక‌గా మారింది. గిల్లిక‌జ్జాల‌తో మొద‌లైన వీరి ప్ర‌యాణం ఇప్పుడిప్పుడే పాకాన ప‌డుతూ ఒక‌రిపై ఒక‌రు రొమాంటిక్ సాంగ్ లు వేసుకునేలా మారిపోయింది. అఖిల్ కూడా పులిహోర క‌ల‌ప‌డం మొద‌లుపెట్టాడు. అషురెడ్డి కూడా డ్యూటీ ఎక్కేసి ల‌వ్ ట్రాక్ ని స్టార్ట్ చేసింది. ఇది ఏ ట‌ర్న్ తీసుకుంటుందో తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.