షెర్లిన్ కంప్లైంట్.. రాఖీపై ఎఫ్ఐఆర్!
రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఘాటుగా బురద జల్లుకుంటున్నారు. రాఖీ, షెర్లిన్ చర్చలలో ఒకరినొకరు విడిచిపెట్టలేదు. ముందుగా షెర్లిన్ పేరును రాఖీ లాగితే, ఆపై ఆమెపై షెర్లీన్ మాటల దాడి చేసింది. దాంతో రాఖీ మరింత రెచ్చిపోయింది. ఇద్దరు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడమే కాకుండా కేసు నమోదు చేసేందుకు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లారు.