English | Telugu
అభిమానులకు శుభవార్త చెప్పిన 'ట్రిపుల్ ఆర్' స్టార్!
Updated : Jan 3, 2023
బాలీవుడ్లో 'సింగం' సీరీస్ను ఇష్టపడేవారికి శుభవార్త చెప్పేశారు 'ట్రిపుల్ ఆర్' స్టార్ అజయ్ దేవ్గణ్. అజయ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన 'సింగం' ఫ్రాంఛైజీ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్గా మెన్షన్ చేయక్కర్లేదు. ఈ విషయాన్నే సోషల్ మీడియాలో పంచుకున్నారు దేవ్గణ్. రోహిత్ శెట్టితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ, "న్యూ ఇయర్ రోజు చాలా మంచి ప్రయాణం మొదలుపెట్టారు. సింగం కొత్త చాప్టర్ కోసం రోహిత్ శెట్టి మళ్లీ మంచి కథ చెప్పారు. నేను విన్న స్క్రిప్ట్ ఫైర్మీదుంది. మా కాంబినేషన్లో ఇది 11వ బ్లాక్బస్టర్ అవుతుంది" అని రాశారు.
నచ్చి చేసే ఏ పనికి అయినా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని అన్నారు రోహిత్ శెట్టి. రణవీర్సింగ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా ఆయన తెరకెక్కించిన 'సర్కస్' ఇటీవల విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
అయితే 'సింగం' నయా చాప్టర్లో దీపిక పదుకోన్ కూడా నటిస్తారని అనౌన్స్ చేశారు రోహిత్ శెట్టి. 'సింగం' ఫస్ట్ పార్ట్ 2011లో విడుదలైంది. రోహిత్ శెట్టి కాప్ యూనివర్శ్ గా పేరు తెచ్చుకుంది 'సింగం' ఫ్రాంఛైజీ. 2014లో విడుదలైన 'సింగం రిటర్న్స్' కూడా పెద్ద హిట్ అయింది.
2022లో 'ట్రిపుల్ ఆర్'తో మంచి పేరు తెచ్చుకున్నారు అజయ్ దేవ్గణ్. ఈ సినిమాతో సౌత్కి పరిచయమయ్యారు అజయ్. వీరిద్దరి కాంబినేషన్లో మరో ప్యాన్ ఇండియా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.