English | Telugu

కిష్కింధపురి షాకింగ్ కలెక్షన్స్!.. ఇప్పుడేమంటారో చూడాలి 

భైరవం తర్వాత 'బెల్లంకొండ సాయిశ్రీనివాస్'(Bellamkonda Sai srinivas)నిన్నవరల్డ్ వైడ్ గా 'అనుపమ పరమేశ్వరన్'(Anupama Parameswaran)తో కలిసి 'కిష్కింధపురి'(Kishkindhapuri)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హర్రర్, మిస్టరీ, థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana shankara Varaprasad garu)ని నిర్మిస్తున్న 'సాహు గారపాటి' నిర్మించాడు. 'చావు కబురు చల్లగా' ఫేమ్ 'కౌశిక్ పెగుళ్ళపాటి'(Koushik pegallapati)దర్శకుడు. ప్రచార చిత్రాల్లో సాయిశ్రీనివాస్ మాట్లాడుతు 'కిష్కిందపురి'థియేటర్లలోకి వెళ్లిన పది నిమిషాల తర్వాత ప్రేక్షకులు ఫోన్ పట్టుకుంటే తాను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని చెప్పడంతో రిలీజ్ కి ముందే 'సాయిశ్రీనివాస్' అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకుంది.

ఎస్తర్ నొరోన్హా రెండో పెళ్లి? వరుడు అతనేనా!

'ఎస్తర్ నోరోన్హా'(ester Noronha)2019 అక్టోబర్ లో ప్రముఖ సింగర్, నటుడు నోయల్(Noyel)ని వివాహం చేసుకుంది. పట్టుమని పదహారు రోజులు కూడా ఆ ఇద్దరు కలిసి లేరు. దీంతో 2020 లో విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి ఎస్తర్ ఒంటరిగానే ఉంటు పలు చిత్రాలతో బిజీగా ఉంటు వస్తుంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతు నాకు ఒంటరిగా బతకాలని లేదు. అందమైన జీవితం కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నాకు నచ్చిన  వ్యక్తి కోసం వెతుకుతున్నాను. షోకేస్ లాంటి భర్త మాత్రం వద్దని చెప్పుకొచ్చింది. దీంతో ఎస్తర్ పెళ్లి కబురు ఎప్పుడు చెప్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తు వస్తున్నారు.

లిటిల్ హార్ట్స్ కి మిరాయ్ స్ట్రోక్! 

యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్, ఫాంటసీ జోనర్ లో తెరకెక్కిన 'మిరాయ్'(Mirai)నిన్నవరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా ప్రస్తుత కాలానికి, మన పురాణ ఇతిహాసాల్ని ముడిపెడుతు 'మిరాయ్' తెరకెక్కింది. నటీనటుల పెర్ఫార్మెన్స్ తో పాటు, 24 క్రాఫ్ట్స్ పనితనం మెస్మరైజ్ చెయ్యడంతో, ఒక కొత్త అనుభూతిని పొందుతున్నామనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ శాతం రివ్యూలు కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. దీంతో  'మిరాయ్' భారీ కలెక్షన్స్ ని రాబడుతుందనే వ్యాఖ్యలు సినీ ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.