English | Telugu

ఫస్ట్‌ రామ్‌చరణ్‌.. తర్వాతే అల్లు అర్జున్‌ : మైత్రి మూవీ మేకర్స్‌!

2018లో రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో సుకుమార్‌ చేసిన ‘పుష్ప’, ‘పుష్ప2’ చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘పుష్ప2’ రికార్డు స్థాయి కలెక్షన్స్‌తో అంతకు ముందు వున్న రికార్డులను క్రాస్‌ చేసేసింది. ఇలా వరస విజయాలతో దూసుకెళ్తున్న సుకుమార్‌ నెక్స్‌ట్‌ సినిమా ఏమిటి? అనేది అందరిలోనూ ఉన్న ప్రశ్న. త్వరలోనే ‘పుష్ప3’ ఉంటుందని కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతల్లో ఒకరైన నవీన్‌ ఎర్నేని క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల విడుదలైన ‘డ్యూడ్‌’ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన సక్సెస్‌మీట్‌లో ‘పుష్ప3’ ఎప్పుడు ఉంటుంది అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు నవీన్‌ ఎర్నేని సమాధానమిస్తూ ‘మా బేనర్‌లో ఫస్ట్‌ రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది. ప్రస్తుతం చరణ్‌ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన వెంటనే ఏప్రిల్‌, మే నెలల్లో చరణ్‌, సుకుమార్‌ సినిమా స్టార్ట్‌ అవుతుంది’ అని వివరించారు. సో.. దీన్నిబట్టి ఇప్పట్లో ‘పుష్ప3’ ఉండకపోవచ్చని చెప్పకనే చెప్పారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.