English | Telugu

ఏమైంది చిరు.. ఎందుకు అప్ డేట్ ఇవ్వడం లేదు 

-సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న ఫ్యాన్స్
-మెగా కోలాహాలం
-విశ్వంభర ఎప్పుడు
-మన శంకర వర ప్రసాద్ గారు ఏం చేస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)సినిమా రిలీజ్ రోజు థియేటర్స్ దగ్గర ఏర్పడే పండుగ వాతావరణం తెలిసిందే. ఆ రోజు మూవీ లవర్స్ ఎవరో అభిమానులు ఎవరో తెలుసుకోవడం కష్టం. అంతలా థియేటర్స్ దగ్గర మెగా జాతర జరుగుతుంది. అసలు సినిమా రిలీజ్ రోజే కాదు. మెగాస్టార్ కొత్త సినిమాకి సంబంధించిన న్యూస్ వచ్చినా చాలు అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. నాలుగు దశాబ్దాలాగా ఇదే తంతు.


మెగాస్టార్ ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)తో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటంతో పాటు వరప్రసాద్ గారు రాక కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం అభిమానులు నిరాశతో ఉన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు స్పందిస్తు 'మన శంకర వర ప్రసాద్ గారు గురించే అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

కానీ మరో అప్ కమింగ్ మూవీ 'విశ్వంభర'(Vishwambhara) గురించి ఎందుకు అప్ డేట్ ఇవ్వడం లేదు. సిజి వర్క్ లేట్ అవ్వడం వలన నెక్స్ట్ ఇయర్ వేసవిలో రిలీజ్ ఉంటుందని చిరంజీవి ప్రకటించారు. కానీ అప్పటి వరకు మూవీకి సంబంధించిన ప్రమోషన్ ని ఏదో ఒక రూపాన ఇస్తూ ఉండాలి. ఆ విధంగా చేస్తుండటం వలన విశ్వంభర ప్రేక్షకులకి దగ్గరగానే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కోరుతున్నారు.


also read:అఖండ 2 చూడటానికి ఎంత మంది అఘోరాలు వస్తున్నారు! ఆ ఏరియా నుంచి ఎంత

సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్ రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా. గేమ్ చెంజర్ కోసం వాయిదా పడినా ఈ సంవత్సరం లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకున్నారు. కానీ వాయిదా పడి నెక్స్ట్ ఇయర్ వేసవికి రానుంది. అందుకే అభిమానులు విశ్వంభర అప్ డేట్స్ ఇస్తుండమని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. చిరంజీవి సరసన త్రిష, ఆషిక రంగనాధ్, సుర్బి పురానిక్ హీరోయిన్స్ గా చేస్తుండగా బింబి సార ఫేమ్ వశిష్ఠ(Vasishta)దర్శకుడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.