English | Telugu

ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చిన తులసి.. ఎందుకిలా చేసింది?

హీరోయిన్‌గా కంటే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే తులసి అందరికీ పరిచయం. అక్క, వదిన, అమ్మ.. ఇలాంటి క్యారెక్టర్స్‌తోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైన తులసి కెరీర్‌ ఎంతో సుదీర్ఘమైందని చెప్పాలి. 1967లో ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2025 సంవత్సరంలో తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో 7 సినిమాలు చేసి నటిగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ఆమె చేసిన ప్రకటన అందర్నీ షాక్‌కి గురి చేసింది.

1967లో ఏడాదిన్నర వయసులో భార్య అనే చిత్రంలో తొలిసారి తెరపై కనిపించిన తులసి.. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో 300కి పైగా సినిమాల్లో నటించారు. అయితే వీటిలో ఎక్కువ శాతం తెలుగు, కన్నడ సినిమాలే ఉండడం విశేషం. చిల్లరకొట్టు చిట్టెమ్మ, సీతామాలక్ష్మీ చిత్రాలు బాలనటిగా తులసికి ఎంతో పేరు తెచ్చాయి. ఆ తర్వాత చేసిన శంకరాభరణం చిత్రంతో బాలనటిగా అలరించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత చెల్లెలు పాత్రలకే పరిమితమైపోయారు. తులసి హీరోయిన్‌గా నటించిన చివరి చిత్రం కన్నయ్య కిట్టయ్య. 1996లో కన్నడ డైరెక్టర్‌ శివమణిని వివాహం చేసుకొని కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2003లో ఎక్స్‌క్యూజ్‌మి అనే కన్నడ చిత్రం ద్వారా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేశారు. అయితే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కన్నడలో 15 సినిమాలు చేసిన తర్వాత శశిరేఖా పరిణయం చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమాలు చేస్తూనే ఉన్న తులసి.. తాజాగా తను నటిగా రిటైర్‌ అవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 31వ తేదీతో తను నటన నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. గత కొన్నేళ్లుగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్న తులసి.. సాయిబాబా భక్తురాలు. ఇన్‌స్టాలో హ్యాపీ రిటైర్‌మెంట్‌ అని రాసి ఉన్న ఒక కార్డును పోస్ట్‌ చేస్తూ.. డిసెంబర్‌ 31న షిరిడీ వెళుతున్నానని, ఆరోజే తన రిటైర్‌మెంట్‌ ఉంటుందని ప్రకటించారు. రిటైర్‌ అయిన తర్వాత సాయిబాబాకు సేవ చేసుకుంటూ జీవిస్తానని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. సినిమాల నుంచి తప్పుకొని భక్తి మార్గం వైపు వెళుతున్న తులసిని ప్రేక్షకులు, అభిమానులు అభినందిస్తూ ఆమెకు దేవుని ఆశీస్సులు ఉండాలని కామెంట్స్‌ పెడుతున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.