English | Telugu

రాజమౌళి కి షాక్ ఇచ్చిన రాష్ట్రీయ వానరసేన.. సరూర్ నగర్ లో పోలీస్ కేసు నమోదు  

-రాజమౌళి కి షాక్
-హనుమంతుడి పై ఏం మాట్లాడాడు
-నాకు నమ్మకం లేదు
-ఇదేనా చేసేది


దర్శక ధీరుడు రాజమౌళి(Ss Rajamouli),సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని నిర్మిస్తున్న చిత్రం 'వారణాసి'(Varanasi). భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఒక సువర్ణ అధ్యయనాన్ని లిఖించడంతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచ సినీ యవనిక పై నిలబెట్టడమే లక్ష్యంగా శరవేగంగా ముస్తాబవుతుంది. భారతీయ ఇతిహాసమైన రామాయణం యొక్క గొప్పతనాన్ని కూడా 'వారణాసి' లో చెప్పబోతున్నారు. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారకంగా వెల్లడి కూడా చేసింది.దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు 'వారణాసి' రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.


మొన్న శనివారం 'వారణాసి' కి సంబంధించిన మొట్టమొదటి అధికార ఫంక్షన్ హైదరాబాద్(Hyderabad)రామోజీ ఫిలిం సిటీ లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతు దేవుడిపై నాకు పెద్ద నమ్మకం లేదు. ఇంత పెద్ద ఎత్తున ఫంక్షన్ నిర్వహిస్తున్నావు కదా, హనుమంతుడు నీ వెనకే ఉండి నీ గుండె తట్టి నడిపిస్తాడని మా నాన్న చెప్పాడు.నాకు కోపం వచ్చింది. ఇదా నన్ను నడిపించేది. నా వైఫ్ కి హనుమంతుడు(Hamumanthudu)అంటే చాలా ఇష్టం. ఆమె ఆయనతో మాట్లాడుతు కూడా ఉంటుంది. కానీ ఇలా చేసాడు అనే వ్యాఖ్యలు చెయ్యడం జరిగింది.

రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలపై హిందు సమాజానికి చెందిన 'రాష్ట్రీయ వానరసేన'(Rashtriya Vanara sena)మండి పడుతుంది. సదరు వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో రాజమౌళి పై కేసు నమోదు చేసింది. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు కేసుపై రాజమౌళి ఏం మాట్లాడతాడనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.


Also Read: బైసన్ ఓటిటి రిలీజ్ డేట్ ఇదే.. హిందీ, కన్నడ, మలయాళ వారికి భారీ గిఫ్ట్


రాజమౌళి అనుకున్న విధంగా ఈవెంట్ జరగకపోవడం,టెక్నీకల్ గా కూడా ఎన్నో లోపాలు తలెత్తడంతోనే రాజమౌళి ఆ విధంగా మాట్లాడాడని సోషల్ మీడియా వేదికగా పలువురు వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఒక్కటి మాత్రం నిజం 'వారణాసి'లో రామదూత ఆంజనేయుడుకి అగ్ర తాంబూలం ఇవ్వడం ఖాయం. రాముడు ఉంటే ఆంజనేయుడు ఉండాల్సిందే. మహేష్ రాముడుగా కనిపిస్తున్న విషయం తెలిసిందే.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.