English | Telugu

అల్లుఅర్జున్ పై ఓజి విలన్ షాకింగ్ కామెంట్స్.. నెంబర్ వన్ హీరో ఆయనే 

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(OG)మంచి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. 24 క్రాఫ్ట్స్ పని తీరుతో పాటు నటీనటులు ప్రదర్శించిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇందుకు కారణమని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా పవన్ తో పాటు మిగతా నటీనటులు తమ అద్భుతమైన నటనతో మెప్పించారు. అలాంటి నటుల్లో ముంబై(Mumbai) కి చెందిన 'సుదేవ్ నాయర్'(Sudev Nair)ఒకరు. జిమ్మీ అనే నెగిటివ్ రోల్ లో సుదేవ్ ఒక రేంజ్ లో పెర్ఫార్మ్ ని ప్రదర్శించాడు. ఒక రకంగా చెప్పాలంటే జిమ్మీ చేసిన ఒక హత్య వల్లనే ఓజి కథ జరుగుతుంది.

రీసెంట్ గా సుదేవ్ నాయర్ 'తెలుగువన్'(Telugu One)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు నాకు అల్లు అర్జున్(Allu Arjun)అంటే చాలా ఇష్టం. ఆయనకి పెద్ద అభిమానిని. అసలు హీరో అంటే అల్లు అర్జున్ నే. ఆయనతో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాను. మంచు లక్ష్మి(Manchu lakshmi)గారు మలయాళంలో ఒక సినిమా షూట్ లో పాల్గొన్నపుడు అల్లు అర్జున్ అంటే ఇష్టం గురించి ఆమెకి చెప్పాను. వెంటనే అల్లుఅర్జున్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది. దాంతో అల్లు అర్జున్ నాకు ఫోన్ లో కెరీర్ కి సంబంధించి బెస్ట్ విషెస్ చెప్పారు. అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలని ఉంది. పర్సనల్ గా కూడా ఆయన్ని కలవాలని ఉందని తెలిపాడు. ఇప్పుడు ఈ మాటలు అల్లు అర్జున్ అభిమానుల్లో జోష్ ని తెప్పిస్తున్నాయి.

మోడల్ గా కెరీర్ ని ప్రారంభించిన సుదేవ్ నాయర్ బాలీవుడ్ లో తెరకెక్కిన 'గులాబ్ జంగ్' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత కన్నడ, మలయాళ భాషల్లో సుమారు ఇరవై చిత్రాల వరకు చేసాడు. 2023 లో 'టైగర్ నాగేశ్వరరావు' తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి దేవర మొదటి భాగంలో కీలక పాత్రలో మెరిశాడు. ప్రస్తుతం యష్, గీతు మోహన్ దాస్ ల టాక్సిక్ లో చేస్తుండగా, పలు కొత్త చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.