English | Telugu

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ రెడీ.. నో ఇండోర్‌.. ఓన్లీ ఔట్‌డోర్‌!

కె.జి.ఎఫ్‌. సిరీస్‌, సలార్‌ చిత్రాలతో డైరెక్టర్‌గా ప్రశాంత్‌ నీల్‌ ఏ రేంజ్‌కి వెళ్లిపోయాడో అందరికీ తెలిసిందే. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌, దేవర వంటి వరస సూపర్‌హిట్స్‌తో తన స్టార్‌డమ్‌ని మరింత పెంచుకున్నారు ఎన్టీఆర్‌. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో సినిమా ఎనౌన్స్‌ చేసిన రోజు నుంచీ ఎప్పుడు ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వస్తుందా అని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని ప్రశాంత్‌ నీల్‌ చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

కొద్దికాలంగా ఈ సినిమా షూటింగ్‌ మొదలు కాబోతోంది అంటూ పలు వార్తలు వచ్చాయి. కానీ, అది కార్యరూపంలోకి రాలేదు. అయితే ఈ సినిమా షూటింగ్‌ ఫిబ్రవరి చివరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చివరి దశకు చేరుకున్న తరుణంలో ఈ వార్తకు ప్రాధాన్యం పెరిగింది. ఈ సినిమా కోసం ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌, కోల్‌కతా, గోవా, శ్రీలంకలతోపాటు మరికొన్ని ప్రదేశాల్లో ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. టోటల్‌గా షూటింగ్‌ అంతా ఔట్‌డోర్‌లోనే జరుగుతుందట. ఇన్‌డోర్‌ షూటింగ్‌ అనేది ఉండదని తెలుస్తోంది.

ఫిబ్రవరి చివరలో షూటింగ్‌ ప్రారంభించినప్పటికీ ఎన్టీఆర్‌ మాత్రం మార్చిలోగానీ, ఏప్రిల్‌లోగానీ జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్‌ మూవీ ‘వార్‌2’లో ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. అది కంప్లీట్‌ అయిన తర్వాత ఎన్టీఆర్‌ తన పూర్తి సమయాన్ని ప్రశాంత్‌ నీల్‌ సినిమాకి కేటాయిస్తారని తెలుస్తోంది. ‘వార్‌2’ చిత్రాన్ని ఆగస్ట్‌ 14న విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ‘డ్రాగన్‌’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. సాధారణంగా ప్రశాంత్‌ నీల్‌ తన సినిమాల షూటింగ్‌కి ఎక్కువ సమయం తీసుకుంటాడు. కానీ, ఈ సినిమా షూటింగ్‌ని యుద్ధ ప్రాతిపదికపైన పూర్తి చేసి 2026 జనవరి 9న రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేశారు. ఇప్పటికే రిలీజ్‌ డేట్‌ని కూడా ఎనౌన్స్‌ చేసిన మేకర్స్‌ దాన్ని దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.