English | Telugu

దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులపై కేసు!

దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ పేరును దుర్వినియోగం చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైకి చెందిన అనిల్‌ మిశ్రా, అతని కుమారుడు అభిషేక్‌, మరో వ్యక్తి కలిసి దాదాసాహెబ్‌ ఫాల్కే పేరుతో అవార్డుల వేడుక నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యక్రమంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఫోటోలను ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతుతోనే ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు నమ్మించి.. పలు సంస్థల నుంచి స్పాన్సర్‌షిప్‌లు పొందారు. అలాగే అవార్డులను అమ్ముకోవడంతో పాటు, ఈవెంట్ కి హాజరయ్యే వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. బీజేపీ ఫిల్మ్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ సమీర్ దీక్షిత్ ఫిర్యాదుతో ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.