English | Telugu

దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులపై కేసు!

దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ పేరును దుర్వినియోగం చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైకి చెందిన అనిల్‌ మిశ్రా, అతని కుమారుడు అభిషేక్‌, మరో వ్యక్తి కలిసి దాదాసాహెబ్‌ ఫాల్కే పేరుతో అవార్డుల వేడుక నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యక్రమంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఫోటోలను ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతుతోనే ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు నమ్మించి.. పలు సంస్థల నుంచి స్పాన్సర్‌షిప్‌లు పొందారు. అలాగే అవార్డులను అమ్ముకోవడంతో పాటు, ఈవెంట్ కి హాజరయ్యే వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. బీజేపీ ఫిల్మ్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ సమీర్ దీక్షిత్ ఫిర్యాదుతో ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.