English | Telugu

సెకండ్ సాంగ్ రిలీజ్ టైం ఇదేనా!.. ఆ సాంగ్ కి పోటీగా తెస్తున్నారా!

-సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఇదే
-ఆ సాంగ్ కి పోటీ తప్పదా
-అభిమానులు వెయిటింగ్
-చిరంజీవి, వెంకటేష్ ఎలా కనిపించనున్నారు

మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)అప్ కమింగ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)రాక కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత చిరంజీవి చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడం, సదరు జోనర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అనిల్ రావిపూడి(Anil ravipudi) దర్శకుడు కావడంతో 'మన శంకర వరప్రసాద్ గారు' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా విక్టరీ వెంకటేష్(venkatesh)కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడంతో వెంకటేష్ అభిమానులు కూడా మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

చిరంజీవి సినిమాల్లో సాంగ్స్ అంటే ఎంతగా మెప్పిస్తాయో తెలిసిందే. అందుకు తగ్గట్టే 'మన శంకర వరప్రసాద్ గారు' నుంచి వచ్చిన మొదటి సాంగ్ 'మీసాల పిల్ల' ట్యూన్ పరంగా గాని లిరిక్స్ పరంగా ఎంతో క్యాచీగా ఉండటంతో అందరకి ఎంతో బాగా నచ్చింది. దీంతో మిగతా సాంగ్స్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం నవంబర్ చివరి వారంలో సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సదరు సాంగ్ డ్యూయట్ సాంగ్ అని మీసాల పిల్ల కి గట్టి పోటీ ఇస్తుందనే టాక్ కూడా వినపడుతుంది. మరి ఈ వార్తే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కి ఈ నెల చివర్లో పండగ వాతావరణం వచ్చినట్లే. ఇక సెకండ్ సాంగ్ న్యూస్ సోషల్ మీడియాలో కూడా వస్తుండటంతో మీసాల పిల్ల సాంగ్ ప్రమోషన్ ని ఆ సాంగ్ పాడిన ఉదిత్ నారాయణతో వినూత్నంగా నిర్వహించారు.

also read: గ్లోబ్ ట్రోటర్, వారణాశి, రాముడు.. వారణాసి కథ ఇదేనా!


మరి సెకండ్ సాంగ్ ఎవరు పాడారు. ఈ సారి ప్రమోషన్ ఎలా ఉండబోతుందో అని సోషల్ మీడియా వేదికగా అభిమానులు,పాటల ప్రేమికులు చెప్పుకుంటున్నారు. భీమ్స్(Bheems)సంగీత సారధ్యంలో మన శంకర్ వర ప్రసాద్ గారు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు ని సుస్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార(Nayanthara)హీరోయిన్ కాగా చిత్ర పరిశమ్రకి సంబంధించిన అతిరథ మహారధులు మన శంకర వర ప్రసాద్ గారు లో కనువిందు చేయనున్నారు.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.