English | Telugu

మహేష్ కోసం కథ రెడీ చేస్తున్న సందీప్ రెడ్డి.. స్పిరిట్ సంగతేంటి..?

- మహేష్, సందీప్ రెడ్డి కాంబోలో మూవీ!
- కథ రెడీ చేస్తున్న సందీప్!
- మరి స్పిరిట్ ఎప్పుడు?

ప్రభాస్ తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన సౌండ్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో 'స్పిరిట్' షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు కోసం సందీప్ రెడ్డి ఒక కథ సిద్ధం చేస్తున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది. దీంతో 'స్పిరిట్' సంగతేంటి అని చర్చ జరుగుతోంది.

మహేష్ బాబు, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా అనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. 'అర్జున్ రెడ్డి' సమయంలోనే కథా చర్చలు జరిగాయి. కానీ, ఎందుకనో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అలాంటిది ఇప్పుడు మహేష్ నెక్స్ట్ మూవీ సందీప్ డైరెక్షన్ లో చేయడం ఫిక్స్ అయిందని అంటున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేస్తున్నాడు. 2027 వేసవిలో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. దాని తర్వాత సందీప్ తో మహేష్ మూవీ చేయనున్నాడని వినికిడి.

Also Read: మాస్ జాతర బిజినెస్.. ఈసారైనా హిట్ కొడతాడా..?

సందీప్ ఇప్పటికే 'స్పిరిట్' స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయింది. ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు వంద రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు సందీప్. 'ది రాజా సాబ్', 'ఫౌజీ' సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండటంతో.. ఈ గ్యాప్ లో 'స్పిరిట్' వర్క్ తో పాటు, మహేష్ సినిమా కథపై కూడా సందీప్ కసరత్తులు చేస్తున్నారట. ఇప్పటికే స్టోరీ ఒక షేప్ కి వచ్చిందని, తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ ని లాక్ చేసే పనిలో ఉన్నాడని టాక్. ఇటు ప్రభాస్ 'స్పిరిట్' పూర్తయ్యి, అటు రాజమౌళి ప్రాజెక్ట్ నుండి మహేష్ ఫ్రీ కాగానే.. ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

రాజమౌళి సినిమాతో హీరోల ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దీంతో ఆ తదుపరి సినిమాలను హ్యాండిల్ చేయడంలో డైరెక్టర్స్ తడబడుతుంటారు. అయితే మహేష్ విషయంలో అలాంటిది జరగకపోవచ్చు. సందీప్ రెడ్డి డైరెక్టర్ అని న్యూస్ రావడంతో మహేష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత సందీప్ రెడ్డినే బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.