English | Telugu

అదరగొడుతున్నశివ కలెక్షన్స్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ వైరల్   

-థియేటర్స్ లో శివ సందడి
-కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ వైరల్
-సోషల్ మీడియాలో వైరల్


ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ వద్ద కింగ్ నాగార్జున 'శివ'(Shiva)రీ రిలీజ్ తో సందడి చేస్తున్నాడు. అభిమానులతో పాటు ప్రేక్షకులు థియేటర్స్ కి భారీగా పోటెత్తడంతో థియేటర్స్ కలకలలాడుతున్నాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శివ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి(Chiranjeevi)అల్లుఅర్జున్, ఎన్టీఆర్, రాజమౌళి,ప్రభాస్, మహేష్ బాబు వంటి వారు నాగార్జున కి బెస్ట్ విషెస్ చెప్పిన విషయం తెలిసిందే.

రీసెంట్ గా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy venkat reddy)ఎక్స్ వేదికగా స్పందిస్తు 'శివ మూవీ తెలుగు సినీ పరిశ్రమని పూర్తిగా కొత్త దిశలో నడిపించింది.నాగార్జున నటన, స్టైల్, స్క్రీన్ ప్రెజన్స్ అన్ని తరాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఏఎన్ఆర్ గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తు ఇండస్ట్రీ పురోగతికి నాగార్జున చేసిన కృషి అద్భుతం. శివ తర్వాత అన్నమయ్య, రామదాసు, షిర్డీ సాయి వంటి విభిన్న సినిమాలు చేసి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసాడు. నాగార్జున ప్రభావం ముందు తరం హీరోలపై ఖచ్చితంగా ఉంటుందని ట్వీట్ చేసాడు. సదరు ట్వీట్ కి నాగార్జున కూడా స్పందిస్తు టైం ఉంటే సినిమా చూడాలని కోరాడు.

Also read: ప్రీ రిలీజ్ బిజినెస్ లో జననాయగన్ రికార్డు

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.