English | Telugu

లిఫ్ట్ లో ఇరుక్కొని దర్శకుడి కుమారుడు మృతి.. ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ట్వీట్

-షాక్ కి గురవుతున్న భారతీయ చిత్ర పరిశ్రమ
-లిఫ్ట్ లో ఏం జరిగింది!
-పవన్ ట్వీట్ వైరల్

భారతీయ చిత్ర సీమలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఎవరు ఊహించని రీతిలో జరిగిన జరిగిన ఈ సంఘటన చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తుల్లోనే కాకుండా ప్రతి ఒక్కరి హృదయాల్ని కలిచి వేస్తుంది. కేజిఎఫ్ సిరీస్ యష్, ప్రశాంత్ నీల్ కే కాకుండా ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో 'కీర్తన్'(Kirtan)కూడా ఒకరు. ఈయన కేజిఎఫ్ సిరీస్ కి సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పని చేసాడు. రీసెంట్ గా కీర్తన్ కుమారుడు సోనార్ష్(Sonarsh)లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయాడు. పొరపాటున లిఫ్ట్ లో ఇరుక్కోవడం వల్లనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వయసు సుమారు రెండు సంవత్సరాలు.

దీంతో పలువురు సినీ ప్రముఖులు సోనార్ష్ మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సోనార్ష్ మృతి తనని తీవ్రంగా బాధించిందని ఎక్స్ వేదికగా తెలిపాడు. కొన్నిరోజుల క్రితమే ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి కీర్తన్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాని అనౌన్స్ చేసారు. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అలాంటి ఈ టైంలో సోనార్ష్ మరణించడం అత్యంత బాధాకరమైన విషయం.కీర్తన్ స్వస్థలం బెంగుళూర్ కాగా నార్త్ బెంగళూరులోని రాజ్ మహల్ విల్లాస్ లో నివాసం ఉంటున్నాడు

Also read:పెళ్లి చేసుకుంది ఎవర్ని.. మెహ్రిన్ కీలక వ్యాఖ్యలు

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.