English | Telugu

నీల్ కోసం 45 రోజులు.. ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడు..?

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'(Dragon). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్.. కొంత భాగం షూటింగ్ జరుపుకున్న తర్వాత బ్రేక్ వచ్చింది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని, అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పుల కోసమే బ్రేక్ తీసుకున్నారని వార్తలొచ్చాయి. (NTR Neel)

డ్రాగన్ మూవీ షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందా? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే వారి ఎదురుచూపులు ఫలించబోతున్నట్లు తెలుస్తోంది.

డ్రాగన్ షూటింగ్ డిసెంబర్ 1న రీ స్టార్ట్ కానుందట. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ చిత్ర షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఏకంగా 45 రోజులు కేటాయించబోతున్నట్లు సమాచారం.

డిసెంబర్ 1 నుంచి 24 వరకు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షెడ్యూల్ జరగనుందట. అలాగే, జనవరి 5 నుంచి 25 వరకు విదేశాల్లో మరో షెడ్యూల్ జరగనుందట. ఈ రెండు షెడ్యూల్స్ కలిపి ఎన్టీఆర్ ఏకంగా 45 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు వినికిడి.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ న్యూస్.. సందీప్ రెడ్డి మాట నిలబెట్టుకుంటాడా?

డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేశాడట. కేజీఎఫ్, సలార్ ని మించిన ఎలివేషన్స్, ఎమోషన్స్ ఉంటాయని అంటున్నారు.

నెక్స్ట్ రెండు షెడ్యూల్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. డ్రాగన్ సినిమాలో మేజర్ హైలైట్స్ లో ఒకటిగా ఇవి నిలుస్తాయని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, డ్రాగన్ లో తమిళ సీనియర్ యాక్టర్ నాజర్ ఒక కీలక పాత్ర చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆ పాత్రకి సంబంధించి కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ రష్ ని పక్కన పెట్టి, నాజర్ స్థానంలో మలయాళ యాక్టర్ బిజు మీనన్ ని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.