English | Telugu

2010లో రిటైర్‌మెంట్‌ ప్రకటించిన తర్వాత 60 సినిమాలు చెయ్యడానికి రీజన్‌ ఇదే!

- నయనతార చివరి చిత్రం శ్రీరామరాజ్యం

- పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై

- ప్రభుదేవాతో పెళ్లి క్యాన్సిల్ కావడానికి రీజన్ ఇదే

టాలీవుడ్‌ సినిమాల్లో హీరోయిన్లుగా నటించేవారు ఎక్కువ శాతం ఇతర భాషల నుంచి వచ్చినవారే. తెలుగు వారు స్టార్‌ హీరోయిన్లుగా ఎదిగినవారు చాలా తక్కువనే చెప్పాలి. పాతతరం హీరోయిన్లను పక్కన పెడితే మధ్యతరంలో వచ్చిన శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి హీరోయిన్లు కొంతకాలం టాలీవుడ్‌ని ఏలారు. వీరి తర్వాత విజయశాంతి, భానుప్రియ వంటివారు టాప్‌ హీరోయిన్లుగా కొంతకాలం రాణించారు. ఇక రాధ, రాధిక టాప్‌ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ వీరు పరభాషా నాయికలే. వీరి తర్వాత తెలుగు హీరోయిన్లు టాలీవుడ్‌లో కనిపించలేదు.

Also Read:ఐబొమ్మ రవి కంటే పెద్ద దొంగలు వాళ్లే.. సినిమా పైరసీకి బాధ్యులు వాళ్లే!

ఆ తర్వాత బాలీవుడ్‌ హీరోయిన్ల హవా కొంతకాలం కొనసాగింది. వారి తర్వాత త్రిష, నయనతార వంటి పరభాషా హీరోయిన్లు దశాబ్దాలుగా తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నయనతార సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. 2003లో మలయాళ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన నయనతార.. ఆ తర్వాత సౌత్‌లోని అన్ని భాషల్లో టాప్‌ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తన కెరీర్‌ ప్రారంభించిన 7 సంవత్సరాల్లోనే హీరోయిన్‌గా రిటైర్‌ అవుతున్నట్టు 2010లో ప్రకటించారు నయనతార.

నందమూరి బాలకృష్ణ శ్రీరాముడుగా బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీరామరాజ్యం’ తన చివరి చిత్రమని, ఇకపై సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కానీ, ఈ సినిమా తర్వాత తన నిర్ణయం మార్చుకొని హీరోయిన్‌గా కొనసాగారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 60 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు నయనతార. రిటైర్‌మెంట్‌ ప్రకటించిన తర్వాత మళ్ళీ హీరోయిన్‌గా కొనసాగి సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

2010లో ‘శ్రీరామరాజ్యం’ షూటింగ్‌ మొదలైన తర్వాత అదే తన చివరి చిత్రం అనే ఆలోచనలోనే ఉన్నారు నయనతార. ఎందుకంటే ఆ సమయంలో నటుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలు వదులుకోవాలని ప్రభుదేవా కండిషన్‌ పెట్టారు. దానికి అనుగుణంగానే నయన్‌ తన రిటైర్‌మెంట్‌ని ప్రకటించింది. అప్పటికే ప్రభుదేవాకు పెళ్లయింది. అతను రెండో పెళ్లి చేసుకోవడాన్ని అతని భార్య వ్యతిరేకించారు. నయనతార వైఖరి పట్ల పలు మహిళా సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేశాయి. దాంతో ప్రభుదేవాతో తెగతెంపులు చేసుకున్నారు నయనతార.

Also Read: అసలైన దొంగలను వదిలేశారు.. రవిని అరెస్ట్‌ చేశారు.. ప్రశ్నిస్తున్న మూవీ లవర్స్

ప్రభుదేవాతో పెళ్లి క్యాన్సిల్‌ కావడంతో తిరిగి సినిమాలపై దృష్టిపెట్టారు నయనతార. అలా మళ్ళీ నటిగా కొనసాగారు. దానికి తగ్గట్టుగానే సౌత్‌లోని అన్ని భాషల్లో చాలా మంచి పాత్రలు ఆమెకు లభించాయి. అలా స్టార్‌ హీరోయిన్‌ అయిపోయారు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకున్నారు. 2022లో దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లి చేసుకున్నారు నయనతార. పెళ్లి తర్వాత కూడా నటిగా కొనసాగుతున్నారు. 2023లో షారూక్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన ‘జవాన్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటారు. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి సరసన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం అరడజను సినిమాలతో 41 ఏళ్ళ వయసులోనూ హీరోయిన్‌గా బిజీగా ఉన్నారు నయనతార.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.