English | Telugu

వందేళ్ల చరిత్రలో రజినీ నే తొలిసారి.. ఇండియా మొత్తం షాక్ 


-రజినీతో సహా ఫ్యాన్స్ షాక్
-ది హిందూస్థాన్ టైమ్స్ చేసిన పనే ఇది
-స్పందించిన రజిని
-నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి!

'రజినీకాంత్'(Rajinikanth)అనే పేరుకి ఉన్న వైబ్రేషన్ యొక్క స్థాయి ఏ పాటిదో తెలిసిందే. సదరు వైబ్రేషన్ యొక్క రేంజ్ మన దేశంలోనే కాదు విదేశాల్లోను చక్కర్లు కొడుతు ఉంటుంది. సూపర్ స్టార్ అనే టాగ్ లైన్ కూడా తనంతట తానుగా వచ్చి రజినీకాంత్ ని చేరిందనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. సదరు పేరుకి అంతటి విస్ఫోటనని కలిగించే శక్తీ ఉంది. ఈ మాటలన్నీ అక్షర సత్యాలని నిరూపిస్తూ రజినీకాంత్ కి అరుదైన గౌరవం దక్కింది.


ఢిల్లీ కేంద్రంగా నడిచే ప్రముఖ భారతీయ ఆంగ్ల పత్రిక 'ది హిందూస్థాన్ టైమ్స్'(The Hindustan times)కి ఉన్న క్యాపబిలిటీ ఎంతో ప్రత్యేకం. ఎక్కువ సర్క్యులేషన్ కలిగిన న్యూస్ పేపర్ కూడా.1924 లో మహాత్మాగాంధీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. విదేశాల్లో సైతం సదరు ఎడిషన్ కి ఎంతో మంది పాఠకులు ఉన్నారు. అలాంటి ఈ పత్రిక రజినీకాంత్ సినీ ప్రస్థానం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న తమ ఎడిషన్ మొదటి పేజీ మొత్తాన్ని రజినీ ఫోటోతో ముద్రించింది. హిందూ స్థాన్ టైం ఈ వందేళ్లల్లో ఒక హీరో ఫోటోని మొదటి పేజీ మొత్తం ముద్రించడం ఇదే తొలిసారి.

ఈ విషయం ముందుగారజినీ తో పాటు ఎవరకి తెలియదు.దీంతో సదరు మ్యాగజైన్ పై రజినీ ఫోటో చూసి అందరు షాక్ అయ్యారు. ఈ విషయంపై రజినీ స్పందిస్తు అద్భుతమైన సర్ప్రైజ్ కి కృతజ్ఞతలు. హృదయం ఆనందంతో నిండిపోయింది. నా పై చూపిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు. అభిమానులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

also read:మోహన్ బాబు పై చిరంజీవి కీలక వ్యాఖ్యలు.. మోహన్ బాబు వల్లే అది సాధ్యమైంది

సినిమాల పరంగా చూసుకుంటే రజినీ ఈ ఏడాది ఆగస్టు లో 'కూలీ' తో వచ్చి మరోసారి తన పెర్ ఫార్మెన్సుతో మెస్మరైజ్ చేసాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని తన స్నేహితుడు అగ్ర హీరో కమల్ హాసన్ నిర్మాణ సారధ్యంలో చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కి వెళ్లనుంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.