English | Telugu

టాలీవుడ్ ని భయపెడుతున్న డిసెంబర్ 4 

సినిమా వాళ్ళకి సెంటిమెంట్ లు ఎక్కువ. తేదీల విషయంలోనూ ఆ సెంటిమెంట్ లను పట్టించుకుంటారు. టాలీవుడ్ కి లక్కీ డేట్ అంటే ఏప్రిల్ 28 గా చెబుతారు. ఎందుకంటే ఆ డేట్ కి విడుదలైన అడవి రాముడు, పోకిరి, బాహుబలి-2 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అలాగే ఇప్పుడు డిసెంబర్ 4 అనేది అన్ లక్కీ డేట్ గా ముద్రపడింది.

గతేడాది డిసెంబర్ 4న పుష్ప-2(Pushpa 2: The Rule) ప్రీమియర్స్ సందర్భంగా.. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయారు. అదే ఘటనలో కోమాలోకి వెళ్ళిపోయిన రేవతి తనయుడు శ్రీతేజ్ ఇప్పటికీ కోలుకోలేదు. టాలీవుడ్ చరిత్రలో డిసెంబర్ 4 అనేది ఓ కాళరాత్రిలా మిగిపోయింది.

Also Read: పెళ్లయిన ఐదు రోజులకే.. వైరల్ గా మారిన సమంత పోస్ట్..!

డిసెంబర్ 4 నెగటివ్ సెంటిమెంట్ ఈ ఏడాది కూడా కొనసాగింది. డిసెంబర్ 4 రాత్రి ప్రీమియర్స్ తో 'అఖండ 2 తాండవం'(Akhanda 2: Thaandavam) సందడి థియేటర్స్ లో మొదలు కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఫైనాన్షియల్ ఇష్యూ కారణంగా వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక బడా మూవీ ఇలా వాయిదా పడిన సందర్భం దాదాపు లేదనే చెప్పాలి.

పుష్ప-2 విషయంలో తొక్కిసలాట ఘటన, 'అఖండ 2' విషయంలో సినిమా వాయిదా.. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎవరైనా తమ సినిమాని డిసెంబర్ 4 కి విడుదల చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.