English | Telugu

నా భర్త ఒక నార్సిసిస్ట్.. 50 కోట్లు ఇప్పించాలని ప్రముఖ హీరోయిన్ డిమాండ్  

-గృహ హింస కేసు నమోదు చేసిన సెలీనా జైట్లీ
-సెలీనా జైట్లీ ఎవరు
-తెలుగు సినిమాలో చేసిందా
-తన డిమాండ్ ఏంటి!

మంచు విష్ణు(Manchu Vishnu)నుంచి వచ్చిన అనేక సినిమాల్లో సూర్యం కూడా ఒకటి. ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భారతీయ నటి 'సెలీనా జైట్లీ'(Celina jaitly). తొలి చిత్రంతోనే అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో అలరించింది.ఇతర భాషల్లోను సత్తా చాటిన సెలీనా 2011 లో ఆస్ట్రియా దేశానికి చెందిన 'పీటర్ హాగ్'(Peter Haag)అనే వ్యాపార వేత్త ని పెళ్లి చేసుకుంది. ఆ ఇద్దరికి ముగ్గురు పిల్లలు.

రీసెంట్ గా సెలీనా ముంబై లోని జ్యుడిషియల్ మెజిస్రేట్ లో పీటర్ పై గృహ హింస ఆరోపణలు చేస్తు పిటిషన్ దాఖలు చేసింది. సదరు పిటిషన్ లో నా భర్త తనని తాను ఎక్కువగా ఊహించుకొనే ఒక నార్సిసిస్ట్. పిల్లలపై ప్రేమ కూడా లేని ఒక సెల్ఫీస్ట్. శారీరకంగా, మానసికంగా నన్ను లైంగిక వేధింపులకి గురి చేసాడు.ఆస్ట్రియాలో విడాకులకి అప్ప్లై చేయడంతో ఇండియాకి పారిపోయి వచ్చాను.పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ఎంతో కోల్పోయాను.

నా వర్క్ నన్ను చేసుకోనివ్వకుండా ఏదో ఒక రకంగా అడ్డుపడ్డాడు. దాంతో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయాను. పీటర్ నుంచి నెలకి 10 లక్షల రూపాయల భరణంతో పాటు 50 కోట్లు నష్టపరిహారం ఇప్పించాలి. నా పిల్లలు నా దగ్గరకి వచ్చేలా కూడా చూడాలని సెలీనా తన పిటిషన్ లో పేర్కొంది. వచ్చే నెల డిసెంబర్ 12 కి కోర్టు కేసుని వాయిదా వేసింది.


Also read: ఏమైంది చిరు.. ఎందుకు అప్ డేట్ ఇవ్వడం లేదు

హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాకి చెందిన సెలీనా 2003 లో హిందీ సినీ రంగ ప్రవేశం చేసి అనతి కాలంలోనే అగ్ర హీరోలతో జత కట్టింది. వివాహం తర్వాత పెద్దగా సినిమాలు చెయ్యలేదు. 2020 లో సీజన్స్ గ్రీటింగ్స్ అనే షార్ట్ ఫిలింలో కనపడింది. 2001 ఫెమినా మిస్ ఇండియాగా నిలవడమే కాకుండా అదే సంవత్సరం మిస్ యూనివర్స్ పోటీల్లో నాలుగో రన్నర్ అప్ గా నిలిచిన రికార్డు సెలీనా సొంతం.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.