English | Telugu

హైదరాబాద్ లో బాలీవుడ్ స్టార్స్ స్టూడియోలు.. ఒక్కో స్టూడియోకి ఎన్ని ఎకరాలంటే..?

ఫ్యూచర్ సిటీలో భారీ ఫిల్మ్ స్టూడియోలు
ముందుకొచ్చిన బాలీవుడ్ స్టార్స్

హైదరాబాద్ ను ఇండియన్ సినిమా హబ్ గా మారుస్తామని కొద్దినెలల క్రితం తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో పలు ఫిల్మ్ స్టూడియోలు ఉన్నాయి. ఇప్పుడు మరో రెండు స్టూడియోలకు అడుగులు పడుతున్నాయి.

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్ హైదరాబాద్ లో స్టూడియోలు పెట్టడానికి ముందుకొచ్చారు. సల్మాన్ కి చెందిన 'సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్', అజయ్ దేవ్‌గణ్ కి చెందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ 'ఎన్.వై. వీఎఫ్ఎక్స్ వాలా'.. ఈ ఫిల్మ్ స్టూడియోలను ఏర్పాటు చేయనున్నాయి.

అంతర్జాతీయస్థాయిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకున్న విషయం విదితమే. ఐటీ, ఫార్మా వంటి వివిధ రంగాలతో పాటు వినోద రంగానికి కూడా ఇది కేంద్రంగా మారనుంది. ఈ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు నిర్మించడానికి సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్ ముందుకొచ్చారు.

Also Read: బాలకృష్ణకు ఐపీఎస్ అధికారి క్షమాపణలు..!

డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'లో.. ఫిల్మ్ స్టూడియోల ఏర్పాటుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్ కంపెనీలు ఒప్పందం చేసుకునే అవకాశముంది అంటున్నారు. ఒక్కో స్టూడియో ఏర్పాటుకు 50-60 ఎకరాల స్థలం అవసరమని ఇప్పటికే ఆయా సంస్థల ప్రతినిధులు ప్రభుత్వానికి చెప్పినట్లు సమాచారం.

కాగా, కొద్దిరోజుల క్రితం సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్ విడివిడిగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై.. తెలంగాణ అభివృద్ధిలో భాగమవుతామని చెప్పడం విశేషం.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.