English | Telugu

భారతీయ చిత్ర పరిశ్రమకి ఆయనతోనే ఎంతో మేలు..పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు  

-ఉస్తాద్ రాకకోసం వెయిటింగ్
-హైదరాబాద్ పోలీస్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
-భారతీయ చిత్ర పరిశ్రమకి ఎంతో మేలు
-అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు

ఓజి తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు కనపడతా అనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఉంది. పవన్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)మాత్రం హరీష్ శంకర్(Harish Shankar)దర్శకత్వంలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటు ఉంది. రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోయినా గబ్బర్ సింగ్ కాంబో కావడంతో ఉస్తాద్ రాక కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడటం లేదు.

రెండు రోజుల క్రితం కొత్త సినిమాలని రిలీజ్ రోజే పైరసీ చేస్తు కోట్ల రూపాయలని సంపాదిస్తున్న ఐ బొమ్మ నిర్వాహకుడుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సిటీ కమిషనర్ సజ్జనార్ కి చిత్ర బృందం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తు డబ్బుల పరంగానే కాదు, సృజనాత్మకతని పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలని విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది.

సినిమా విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలని కట్టడి చేయడం దర్శకనిర్మాతలకి సాధ్యం కావడం లేదు. పైగా పైరసీ ముఠా పోలీసులకి సవాల్ విసిరే స్థాయికి వచ్చింది. అటువంటి తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. పైరసీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ అంశం.

also read: నా క్యారక్టర్ ని పుష్ప తో పోల్చవద్దు. పృథ్వీరాజ్ సుకుమారన్ అభ్యర్ధన

ఈ ఆపరేషన్ లో భాగమైన పోలీసులకి, సిటీ కమిషనర్ సజ్జనార్ కి నా అభినందనలు . ఒకసారి నేను సజ్జనార్ తో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్టపోతున్నారో వివరించారు. బెట్టింగ్ యాప్స్ ని కూడా నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోను కదలిక తీసుకువచ్చింది. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకి మేలు చేస్తాయని పవన్ తెలిపారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.