English | Telugu

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఊహించని ఇద్దరు అతిధులు! ఫ్యాన్స్ ఏమంటారో మరి!

ఆ ఇద్దరు వస్తే ఫ్యాన్స్ రియాక్షన్
ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచిన అఖండ 2
బాలయ్య జోరుని ఆపలేరు
డిసెంబర్ 5 న ఫ్యాన్స్ పండుగ

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి 'అఖండ 2(Akhanda 2)తో సిల్వర్ స్క్రీన్ వద్ద జూలు విదల్చడానికి రెడీ అవుతున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య మరో సారి అఖండ 2 తో బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. ప్రేక్షకుల్లో కూడా మూవీ పట్ల ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. డిసెంబర్ 5 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రేపు బెంగుళూరు(Bengaluru)లో స్టార్ హీరో 'శివరాజ్ కుమార్' చీఫ్ గెస్ట్ గా ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ లో కన్నడ ట్రైలర్ రిలీజ్ చేస్తారని టాక్.


ఇక తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలోనే భారీగా జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రాంతంతో పాటు, తెలంగాణలోని హైదరాబాద్ లో ఘనంగా జరపడానికి మేకర్స్ ప్లాన్ చేస్తునట్టుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. మరి కొద్దీ రోజుల్లో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy),ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)చీఫ్ గెస్ట్ లుగా వస్తారనే ప్రచారం జరుగుతుంది. ఒక వేళ ఆ న్యూస్ నిజమైతే కనుక అభిమానుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్స్ట్రా జోష్ ని ఇవ్వడం ఖాయం.


also read:వందేళ్ల చరిత్రలో రజనీ నే తొలిసారి.. ఇండియా మొత్తం షాక్


గతంలో అఖండ మొదటి భాగానికి అల్లు అర్జున్, బాలయ్య నుంచి వచ్చిన మరో చిత్రానికి రేవంత్ రెడ్డి గెస్ట్ లుగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఆ ఇద్దరు గెస్ట్ లుగా వచ్చినా ఆశ్చర్య పడాల్సిన లేదు. బాలయ్య నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో అఖండ 2 కి సంబంధించిన ప్రతి విషయంలోను మేకర్స్ ఎంతో ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.