English | Telugu
దేవుడు తగిన శాస్తే చేశాడంటున్న శృతి హాసన్
Updated : Oct 18, 2023
కమల్ హాసన్ కూతురిగా సినిమా రంగంలోకి ప్రవేశించి తన అద్భుతమైన నటనతో తెలుగు తమిళ హిందీ భాషల్లో అభిమానులని సంపాదించుకున్న నటి శృతి హాసన్. శృతిహాసన్ కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంది. ఈ నెల 26 దాకా ఆగితే నా అభిమానులతో పాటు అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్తానంటూ సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు శృతి చేసిన ఒక ట్వీట్ భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది.
శృతి హాసన్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా నాకు ఫీవర్ గా ఉందని తన అభిమానులకి చెప్తు వస్తుంది. ఫీవర్ రావడానికంటే ముందు నుంచే 26 వ తారీఖున అందరికి గుడ్ న్యూస్ చెప్తానని అంటూ ఉంది. దీంతో అందరు శృతి హాసన్ తన పెళ్లి గురించి చెప్తుందేమో అని అనుకుంటున్నారు. కానీ శృతిహాసన్ రీసెంట్ గా మరొక ట్వీట్ ని చేసింది. నాకు అంతకు ముందు జ్వరంగా ఉన్నా కూడా జ్వరం లేదని అబద్దం చెప్పి కొన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నానని అందుకే దేవుడు నాకు తగిన శాస్తి చేసాడని అంది. ఎందుకంటే అప్పుడు అలా అబద్దం చెప్పినందుకు దేవుడు నాకు జ్వరాన్ని ఎక్కువ చేసాడని తక్కువ జ్వరం కాస్త డెంగ్యూ గా మారిందని చెప్పింది. అలాగే దేవుడు 26 వ తారీకు లోపే తన డెంగ్యూ ఫీవర్ ని తగ్గిస్తాడని కూడా చెప్పింది.
శృతి హాసన్ తెలుగులో దాదాపుగా అగ్ర హీరోలందరి సరసన నటించింది. అలాగే ఆమె సినిమాల విజయాలు శాతం కూడా ఎక్కువే. శృతి ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీ చేసింది. పాన్ ఇండియా మూవీ అయిన సలార్ లో శృతి టీచర్ గా నటిస్తుంది. సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి తన కెరీర్ మళ్ళీ జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్లాలని శృతి కోరుకుంటుంది.
