English | Telugu

సరైనోడు సీక్వెల్ లో హీరో ఎవరో తెలుసా! అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి షాక్! 

-సరైనోడు సీక్వెల్ లో హీరో ఎవరు
-రామ్ చరణ్, అల్లు అర్జున్ తో మల్టీస్టారర్
-అల్లు అరవింద్ కోరిక ఏంటి!
-అసలు సరైనోడు సీక్వెల్ ఉందా!

కొన్ని చిత్రాలు అంత తేలికగా అభిమానులు,ప్రేక్షకుల మస్తిష్కం నుంచి దూరమవ్వవు. అఫ్ కోర్స్ ఆ మూవీ హీరో, మేకర్స్ కూడా సేమ్ సిట్యువేషన్ లోనే ఉంటారు. అలాంటి వైబ్రేషన్ ని సంపాదించుకున్న మూవీ 'సరైనోడు'(Sarrainodu). హీరోగా ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)రేంజ్ ని మరింతగా పెంచిన చిత్రం కూడా. ఈ విషయాన్నీచాలా సందర్భాల్లో అల్లు అర్జునే చెప్పుకొచ్చాడు. దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu)రేంజ్ కూడా సరైనోడుతోనే మరింతగా పెరిగింది. సమ్మర్ కానుకగా 2016 ఏప్రిల్ 22 న మండు వేసవిలో రిలీజై మండు వేసవికి సైతం చెమటలు పట్టించేలా కలెక్షన్ల తుఫాన్ ని సృష్టించింది.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉందనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతుంది. దీంతో సీక్వెల్ కి సంబంధించిన అప్ డేట్ ఏమైనా వస్తుందేమో అని అభిమానులు ఎదురుచూస్తు వస్తున్నారు. రీసెంట్ గా సరైనోడు ని నిర్మించిన అల్లు అరవింద్ సీక్వెల్ గురించి మాట్లాడటం జరిగింది. తన అప్ కమింగ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతు సరైనోడు సీక్వెల్ ని తెరకెక్కించడం జరిగితే నా బ్యానర్ లోనే ఉంటుందని చెప్పాడు. ఒక రకంగా అభిమానులకి ఈ విషయంపై ఆనందంగానే ఉన్నా, కొత్త డౌట్స్ ని కూడా తీసుకొచ్చింది. అల్లు అరవింద్ మాటల్లో తెరకెక్కించడం ఖాయమైతే కనుక అని వచ్చింది. అంటే ఇంకా అధికారకంగా డిసైడ్ అవ్వలేదనే అర్ధం. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో సీ క్వెల్ పై చర్చ జరుగుతుంది.


కానీ ఒక్కటి మాత్రం నిజం. అల్లు అర్జున్ ఒక సందర్భంలో మాట్లాడుతు తక్కువ సమయంలో ఫక్తు కమర్షియల్ సినిమా చేస్తానని, బోయపాటి తోనే చేస్తానని వెల్లడి చేసాడు. దీంతో అల్లు అరవింద్ నుంచి అభిమానులు దాకా సరైనోడుకి సీక్వెల్ చెయ్యమని కోరుతున్నారు. దీంతో సీక్వెల్ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. అల్లు అర్జున్, బోయపాటి మధ్య మంచి అనుబంధం ఉండటం కూడా అభిమానుల కోరికకి బలాన్ని ఇస్తుంది.

Also read: ఇది కదా కావాల్సింది చరణ్.. చికిరి కి భలే అర్ధం చెప్పావు

ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు తమ కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సందర్భంలోనే అల్లు అరవింద్ మాట్లాడుతు రామ్ చరణ్(Ram Charan)అల్లు అర్జున్(Allu Arjun) తో భారీ మల్టి స్టారర్ తెరకెక్కించాలనేది తన కోరిక అని చెప్పాడు. ఈ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇద్దరు మాస్ హీరోలు కాబట్టి సరైనోడు సీక్వెల్ లోనే ఇద్దరు చేస్తే బాగుంటుందనే కామెంట్స్ చేస్తున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.