English | Telugu

సాయిపల్లవి సినిమా బడ్జెట్ 4000 కోట్లు.. పిచ్చోడా మంచోడా ఆ నిర్మాత 

భారతీయుల ఆరాధ్య దైవం 'శ్రీరాముడు'(Sriramudu)పై ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే మరోసారి రణబీర్ కపూర్(Ranbir Kapoor), సాయిపల్లవి(Saipallavi)లు సీతా రాములుగా 'రామాయణ'(Ramayana)తెరకెక్కుతుండగా, ప్రస్తుతం రెగ్యులర్ గా షూటింగ్ ని జరుపుకుంటుంది. 'దంగల్'(Dangal)మూవీతో ఇప్పటి వరకు భారతీయ చిత్ర సీమలో అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన దర్శకుడిగా రికార్డు సృష్టించిన 'నితీష్ తివారి'(Nitesh Tiwari)దర్శకుడు. దీంతో 'రామాయణ' పై అందరిలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రైమ్ ఫోకస్ పతాకంపై 'నమిత్ మల్హోత్రా'(Namit Malhotra)నిర్మిస్తున్నాడు.

రీసెంట్ గా నమిత్ మల్హోత్రా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'ప్రపంచం మొత్తం 'రాముడి' ఇతిహాసాన్నిచూడాలనే లక్ష్యంతో నాలుగువేల కోట్ల రూపాయలతో 'రామాయణ'ని నిర్మిస్తున్నాం. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంత హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫస్ట్ మూవీ రామాయణ. కాకపోతే హాలీవుడ్ తో పోల్చుకుంటే తక్కువే. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా మా సొంతగానే నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నాం. ఏడు సంవత్సరాల క్రితమే రామాయణ పనులు ప్రారంభించాను. కోవిడ్ తర్వాత అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది నన్ను పిచ్చివాడినని అనుకున్నారు. తరాలు మారినా, యుగాలు మారినా రామాయణం ఎప్పటికి గొప్ప ఇతిహాసమే అని నమిత్ మల్హోత్రా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం 'రామాయణ' బడ్జెట్ న్యూస్ ఇండియన్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నిలిచింది.

'రామాయణ' రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం 2026 దీపావళికి , రెండో భాగం 2027 దీపావళి కి విడుదల కానున్నాయి. ప్రపంచంలో ఉన్న అత్యున్నత సాంకేతిక నిపుణుల బృందం 'రామాయణ' కోసం వర్క్ చేస్తుంది. విజువల్ గా కూడా ఒక సరికొత్త 'వండర్' ని ప్రేక్షకులకి పరిచయం చేయనున్నారు. ఇప్పటికే సీతారాములకి సంబంధించి రిలీజైన సాయిపల్లవి, రణబీర్ లుక్ కి మంచి పేరు వచ్చింది. రావణాసురుడిగా కన్నడ సూపర్ స్టార్ 'యష్'(Yash)చేస్తుండంతో పాటు, ఒన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. దీన్ని బట్టి రామాయణ కి ఉన్న క్రేజ్ ఈ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. రాముడి పినతల్లి 'కైకేయి' గా ఒకప్పటి హీరోయిన్ 'లారాదత్తా'(Lara Dutta),'శుర్పణఖ' అనే రాక్షసిగా మరో హీరోయిన్ 'రకుల్ ప్రీత్ సింగ్'(Rakul Preet Singh) కనిపిస్తునట్టుగా వార్తలు వస్తున్నాయి. మిగతా క్యారెక్టర్స్ లలో కూడా భారతీయ చిత్ర పరిశమ్రకి చెందిన అత్యంత ప్రతిభావంతమైన నటీనటులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.