English | Telugu

ప్రభాస్, అనుష్క పెళ్ళి.. వైరల్ గా మారిన వీడియో!

ప్రభాస్(Prabhas), అనుష్క(Anushka) జోడి తెరపై చూడటానికి చాలా బాగుంటుంది. నిజ జీవితంలో మంచి స్నేహితులు కూడా. అందుకే వీరు పెళ్ళి చేసుకుంటే చూడాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. అయితే అభిమానుల కోరిక మాత్రం తీరేలా కనిపించడంలేదు. ఇలాంటి సమయంలో ఒక వీడియో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి..?

ప్రస్తుతం ఏఐ హవా నడుస్తోంది. కొందరు దీనిని చెడుకి ఉపయోగిస్తుంటే, మరికొందరు మాత్రం దానితో అందమైన జ్ఞాపకాలను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒకరు ప్రభాస్-అనుష్క పెళ్ళి అయినట్లుగా ఒక వీడియోని క్రియేట్ చేశారు.

ఈ ఏఐ వీడియోలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పురోహితుడిగా కనిపిస్తున్నారు. వివిధ పరిశ్రమలకు చెందిన సినీ తారలు తరలివచ్చినట్టుగా చూపించారు. రామ్ చరణ్ డోలు కొట్టడం, మహేష్ బాబు-పవన్ కళ్యాణ్ సరదా కబుర్లు, రాజమౌళి-కీరవాణి డ్యాన్స్ చేయడం, కొరియన్ నటుడు డాన్ లీకి బాలకృష్ణ వడ్డించడం వంటివి వీడియోలో హైలైట్ గా నిలిచాయి. ఇక చివరిలో ప్రభాస్-అనుష్కలను కృష్ణంరాజు దీవించడం హృదయాన్ని హత్తుకుంది.

Also Read: మరో తమిళ స్టార్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ!

ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రభాస్ పెళ్ళి చూడాలన్న కోరిక తీరిపోయింది అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.

ఇక ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ "ఏంటిది ఏఐ" అంటూ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో మరింత వైరల్ అవుతోంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.