English | Telugu

తొక్కేయ్యడానికి చూస్తున్నారు..నాకు రాజకీయాలు తెలియవు

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)రీసెంట్ గా 'తండేల్'(Thandel)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.చైతు కెరీర్ లోనే హైబడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ హిట్ దిశగా దూసుకెళ్తుందని,రీసెంట్ గా చిత్ర బృందం సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించింది.సాయి పల్లవి(Sai Pallavi)హీరోయిన్ గా చెయ్యగా,చందు మొండేటి(Chandu Mondeti)దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ తండేల్ ని నిర్వహించింది.

చైతు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నాకు ఎలాంటి రాజకీయాలు తెలియవు.సినిమా కోసం పని చేసానా,ఇంటికి వెళ్ళానా,మన జీవితం మనం చూసుకున్నామా అన్నట్టుగా ఉంటా.దాంతో పీఆర్ టీం పై దృష్టి సారించలేకపోయాను.కాని ప్రస్తుత పరిస్థితుల్లో పిఆర్ టీం చాలా అవసరం.కనీసం నెలకి రెండు మూడు లక్షల అయినా పి ఆర్ టీం కోసం ఖర్చుపెట్టి మన సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చెయ్యాలి.ఇందులో ఎలాంటి తప్పు లేదు.కాకపోతే అనవసర ప్రచారాలు చేస్తు,పక్కోడిని తొక్కేయడానికి చూస్తున్నారు.ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కాదు. అలా పక్కోడిని తొక్కేసే టైంని మీ జీవితంలో ఎదుగుదలకి ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పుకొచ్చాడు.

సమంత(Samantha)తో విడాకులు జరిగిన విషయంలో కూడా మాట్లాడుతూ విడాకులు నైట్ కి నైట్ తీసుకున్న నిర్ణయం కాదు.ఎన్నో రోజుల తర్వాతే విడాకులు నిర్ణయం తీసుకున్నాం.మా విడాకులు ఇతరులకు వినోదం అయిపోయిందని కూడా తెలిపాడు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.