English | Telugu

ఈ నెల 28 న ఏం జరగబోతుంది! లవ్ సింబల్ స్క్రీన్ షాట్ వైరల్  

-ధనుష్, మృణాల్ పోస్ట్ లు వైరల్
-ఈ నెల 28 న సక్సెస్ కొడతాడా!
-ఇద్దరు కలిసి నటించాలని అభిమానుల కోరిక

పాన్ ఇండియా ప్రేక్షకులని తమ పెర్ఫార్మెన్సు తో అలరిస్తూ వస్తున్న పాన్ ఇండియా స్టార్స్ ధనుష్(Dhanush),మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నప్పటికీ డేటింగ్ విషయాన్నీ ఆ ఇద్దరు అధికారంగా చెప్పిన దాఖలాలు లేవు. కాకపోతే డేటింగ్ లో ఉన్నారనే వార్తలకి బలాన్ని చేకూర్చేలా ఇద్దరు కలిసి కొన్ని ఫంక్షన్స్ కి హాజరవ్వడం జరుగుతుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ ఇద్దరి రిలేషన్ హాట్ టాపిక్ గా మారింది.

అందుకు ప్రధానంగా నిలిచింది 'ధో ధీవానే షెహర్ మే'(Do Deewane Shaher Mein)అనే కొత్త చిత్రం. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ నే హీరోయిన్. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మృణాల్ సదరు టీజర్ ని ఇనిస్టా వేదికగా పోస్ట్ చేసింది. సదరు పోస్ట్ కి టీజర్ చాలా బాగుందని ధనుష్ కామెంట్ చేసాడు. ఆ కామెంట్ కి మృణాల్ లవ్ సింబల్ తో రిప్లై ఇచ్చింది. ఇప్పుడు ఈ లవ్ సింబల్ రిప్లై నే హాట్ టాపిక్ గా మారడంతో పాటు, ఇరువురి రిప్లై ల స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read: ప్రముఖ దర్శకుడి హఠాన్మరణం

ధనుష్, మృణాల్ కలిసి ఇంతవరకు ఎలాంటి చిత్రంలో కనిపించలేదు. అభిమానులైతే ఆ ఇద్దరు జోడిగా నటించాలని కోరుకుంటున్నారు. ప్రస్థుతానికి ఈ ఇద్దరు తమ కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రీవియస్ మూవీ ఇడ్లీ కొట్టు తర్వాత ధనుష్ 'తేరే ఇష్క్ మెన్ 'అనే హిందీ మూవీతో సోలో హీరోగా ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ధనుష్ చేస్తున్న నాలుగోవ హిందీ మూవీ ఇది. మొదటి మూడు చిత్రాలు పెద్దగా ప్రేక్షాదరణకి నోచుకోకపోవడంతో 'తేరే ఇష్క్ మెన్'(Tere Ishk Mein)ఫలితంపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. కృతి సనన్(kriti sanon)హీరోయిన్. ఇక మృణాళి చేస్తున్న 'ధో ధీవానే షెహర్ మే' ఫిబ్రవరి 20 న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా సిద్దార్ధ్ చతుర్వేది హీరో.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.