English | Telugu

ఫ్లాప్ మూవీ సీక్వెల్ లో మెగా హీరో!

- టాలీవుడ్ లో కొత్త ట్రెండ్
- ఫ్లాప్ సినిమాకి సీక్వెల్
- సాహసం చేస్తున్న మెగా హీరో

ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. అయితే హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం సహజమే. కానీ, ఒక ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ చేయడానికి ప్రస్తుతం టాలీవుడ్ లో సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సాహసం చేస్తుందని మెగా హీరో కావడం విశేషం.

టాలీవుడ్ లోని టాలెంటెడ్ డైరెక్టర్స్ లో దేవ కట్టా ఒకరు. వెన్నెల, ప్రస్థానం వంటి సినిమాలతో తన ప్రతిభను చాటుకున్నారు. అయినప్పటికీ, నాలుగైదు ఏళ్లకు ఒక సినిమా అన్నట్టుగా ఆయన కెరీర్ సాగుతోంది. చివరిసారి 2021లో వచ్చిన 'రిపబ్లిక్' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు దేవ కట్టా. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ డ్రామా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ, బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది.

'రిపబ్లిక్' మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా.. దేవ కట్టాతో మరోసారి కలిసి పని చేయడానికి సాయి తేజ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అది కూడా 'రిపబ్లిక్' సీక్వెల్ అని సమాచారం. సాయి ధరమ్ తేజ్, దేవ కట్టా మధ్య ఇప్పటికే కథా చర్చలు జరిగాయని.. ప్రస్తుతం సాయి తేజ్ చేతిలో ఉన్న 'సంబరాల ఏటిగట్టు' పూర్తయిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ వినిపిస్తోంది.

Also Read: 'బాహుబలి ది ఎపిక్' యూఎస్ రివ్యూ..!

బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా.. 'రిపబ్లిక్' సినిమాని అభిమానించేవారు బాగానే ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆ సినిమాపై ప్రశంసలు కురుస్తూనే ఉంటాయి. పైగా, ఇటీవల 'మయసభ' అనే పొలిటికల్ సిరీస్ తో దేవ కట్టా ఆకట్టుకున్నారు. అందుకే 'రిపబ్లిక్' సీక్వెల్ తో సాహసం చేయడానికి సాయి ధరమ్ తేజ్ సిద్ధమయ్యారని వినికిడి. చూద్దాం మరి ఈ సీక్వెల్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.